గువాహటి : మీ అమ్మకు చెప్పు.. ఏదో ఒక రోజు నేను సీఎం అవుతా.. కచ్చితంగా సీఎం అయి చూపిస్తా.. అని 30 ఏండ్ల క్రితం చెప్పిన ఓ వ్యక్తి.. ఇప్పుడు నిజంగానే ముఖ్యమంత్రి అయ్యారు. తన భార్యకు ఆనాడు చెప్పినట్లే ఇవ్వాల సీఎం అయ్యారు. ఆయన ఎవరో కాదు.. అసోం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన హిమంత బిష్వ శర్మ.
గువాహటిలోని కాటన్ కాలేజీలో చదువుతున్న రోజుల్లో హిమంత బిష్వ శర్మ వయసు 22 ఏండ్లు. ఆయన తోటి విద్యార్థిని అయిన రినికి భుయాన్కు 17 ఏండ్లు. తనతో కలిసి చదువుకున్న రినికి అంటే హిమంతకు ప్రేమ. ఏదో ఒక రోజు ముఖ్యమంత్రిని అవుతాను. ఈ విషయం మీ అమ్మతో చెప్పు అని ఆరోజుల్లోనే తనతో చెప్పాడంట హిమంత. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం గువాహటిలో జరిగిన సన్మాన సభలో హిమంత బిష్వ శర్మ మాట్లాడుతూ గత స్మృతులను నెమరేసుకున్నారు. 30 ఏండ్ల క్రితం నా భార్యతో చెప్పినట్లుగా ఇవ్వాల ముఖ్యమంత్రి అయ్యాను, ఇంతకన్నా కావాల్సిందేముంది.. అని అన్నారు.
ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే మా పెండ్లి జరిగిందని, ఆ తర్వాత మంత్రి అయ్యారని హిమంత బిష్వ శర్మ శ్రీమతి గుర్తుచేసుకున్నారు. ఇన్నాళ్లు రాజకీయాల్లో ఎలా నెగ్గుకొస్తున్నాడో ప్రత్యక్షంగా చూస్తున్నానని, ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారని రినికి చెప్పారు.
కాలేజీ చదువుకునే రోజుల్లోనే హిమంత రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్లో చేరి అనేక సంవత్సరాలు పనిచేశారు. అనంతరం 1994 లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2001 లో తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
1 ఎంజీలో టాటా 65 శాతం వాటా కొనుగోలు
ఎన్నికల్లో ఓడిన మంత్రికి ఉన్నత పదవి.. టీఎంసీలో చేరిన వామపక్ష నేతలు
నౌకలు నిలిచిపోకుండా సూయెజ్ కాలువలో పనులు
కొవిడ్ సెకండ్ వేవ్ వెళ్లిపోయింది.. కానీ, ముప్పు ఇంకా అలాగే ఉంది..
ఎన్నికల విధుల్లో చనిపోయిన వారికి కోటి ఇవ్వాల్సిందే: అలహాబాద్ హైకోర్టు
భారత చిన్నారులపై కోవాక్సిన్ ట్రయల్స్.. ఎక్స్పర్ట్ ప్యానెల్ ఆమోదం
సేవకు ప్రతిరూపాలు వీరే.. చరిత్రలో ఈరోజు
పండ్ల రారాజు మామిడితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..