లక్నో : ఎన్నికల విధిలో ఉండి కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.1 కోటి పరిహారం అందించాలని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు ఎన్నికల విధిలో ఉండి కరోనాతో చనిపోయిన వారికి యూపీ ప్రభుత్వం రూ.30 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది.
యూపీ పంచాయతీ ఎన్నికల విధి నిర్వహణలో కరోనాతో చనిపోయిన అధికారులు, ఉద్యోగుల కుటుంబానికి పరిహారం మొత్తాన్ని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. పరిహారం మొత్తం కనీసం రూ.1 కోటి ఉండాలని బుధవారం తెలిపింది. జస్టిస్ సిద్ధార్థ్ వర్మ, జస్టిస్ అజిత్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తరప్రదేశ్లో కొవిడ్ వ్యాప్తికి సంబంధించి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించింది. ఏం చర్యలు తీసుకుంటున్నారో నివేదిక అందజేయాలని సూచిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 17 కు వాయిదా వేసింది.
ఎన్నికల విధి నిర్వహణలో కరోనాతో చనిపోయిన ఉద్యోగుల బంధువులకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.30 లక్షల పరిహారం ప్రకటించింది. దీనిపై దాఖలైన పిల్ను విచారించిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం.. ఎన్నికల సంఘం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పరిహారం మొత్తాన్ని పునఃపరిశీలిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నది. ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు జరుపకుండానే రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగా ఉద్యోగులను ఎన్నికల విధి నిర్వహణకు బలవంతం చేశాయని హైకోర్టు తెలిపింది. ఇటువంటి పరిస్థితిలో కుటుంబానికి ఆధారమైన వ్యక్తి చనిపోయతే ఆ కుటుంబానికి కనీసం కోటి రూపాయల పరిహారం అందిస్తే సబబుగా ఉంటుందని భావిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.
భారత చిన్నారులపై కోవాక్సిన్ ట్రయల్స్.. ఎక్స్పర్ట్ ప్యానెల్ ఆమోదం
సేవకు ప్రతిరూపాలు వీరే.. చరిత్రలో ఈరోజు
జీ 7 శిఖరాగ్ర భేటీకి మోదీకి ఆహ్వానం.. వెళ్లకూడదని నిర్ణయం
తేహ్రీలో ఆకస్మిక వరదలు.. పెద్ద ఎత్తున నష్టం
1.41 బిలియన్లకు చైనా జనాభా.. రానున్న రోజుల్లో కష్టాలు తప్పవా..?!
పండ్ల రారాజు మామిడితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!
తుపాకులను నియంత్రించాల్సిందే: పుతిన్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..