న్యూఢిల్లీ : భారతీయులకు శుభవార్త..! కొవిడ్ సెకండ్ వేవ్ పీక్ స్టేజ్ వెళ్లిపోయింది. కానీ ముప్పు మాత్రం ఇంకా అలాగే ఉన్నది. భారత్లో వరుసగా నాలుగు రోజులుగా 4 లక్షలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదైన తర్వాత ఇప్పుడు అది క్రమంగా తగ్గుతున్నది. ఈ వ్యాధితో పోరాడుతున్న దేశాలకు ఇది మంచి సంకేతంగా చెప్పుకోవచ్చు. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,48,421 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రాతిపదికన దేశంలో సెకండ్ వేవ్ కరోనా పీక్ స్టేజ్ ఇప్పుడు దాటిందని నిపుణులు చెప్తున్నారు.
ఢిల్లీలోని సఫ్దర్జంగ్ హాస్పిటల్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగం హెడ్ డాక్టర్ జుగల్ కుషర్ ప్రకారం, దేశంలో సెకండ్ వేవ్ పీక్ స్టేజ్ ఇప్పుడు ముగిసింది. ప్రస్తుతం కేసుల్లో క్రమంగా క్షీణత నమోదవుతున్నదని ఆయన చెప్పారు. సెకండ్ వేవ్ పీక్ స్టేజ్ జాతీయ స్థాయిలో ముగిసిందని ఆయన చెప్పినప్పటికీ, అది పూర్తిగా రాష్ట్ర స్థాయిలో పూర్తి కాలేదని గుర్తుపెట్టుకోవాలి. ఆయన చెప్పినదాని ప్రకారం, ఈ సెకండ్ వేవ్ పీక్ స్టేజీ కొన్ని రాష్ట్రాల్లోకి వచ్చింది. మరికొన్ని రాష్ట్రాల్లో రాబోతున్నది. ప్రమాదం ఇంకా వాయిదా పడకపోయినా.. జాతీయ స్థాయిలో ఈ దశ ఇప్పుడు గడిచిందని చెప్పవచ్చు.
ఏదైనా వేవ్ వైరస్ మారుతున్న స్వభావంపై ఆధారపడి ఉంటుందని థర్డ్ వేవ్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా డాక్టర్ జుగల్ కిషోర్ చెప్పారు. వైరస్ మ్యుటేషన్ నిరంతరం కొనసాగితే అది వచ్చే అవకాశం ఉంటందన్నారు. వ్యాధినిరోధక శక్తి పొందిన వ్యక్తులు కొంతకాలం తర్వాత పోగొట్టుకున్నా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాన్ని తోసిపుచ్చలేమని చెప్పారు. ఇటువంటి పరిస్థితిలో వైరస్ మారుతున్న స్వభావం ఇలాంటి ప్రజలను తిరిగి చుట్టుముడుతుందని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్లో దేశ జనాభాలో 50 శాతం మంది దెబ్బతిన్నారని ఆయన చెప్పారు. ఫస్ట్, సెకండ్ వేవ్ పట్టు నుంచి బయటపడిన వారు థర్డ్ వేవ్లో వైరస్ సోకే అవకాశాలు ఉన్నాయన్నారు. థర్డ్ వేవ్ వచ్చే అవకాశాన్ని తోసిపుచ్చలేం. కానీ దానిని కూడా నివారించవచ్చునని, ఇందుకు ప్రజలకు వేగంగా టీకాలు వేయడం ఒక్కటే మనముందున్న మార్గమని వెల్లడించారు.
ఎన్నికల విధుల్లో చనిపోయిన వారికి కోటి ఇవ్వాల్సిందే: అలహాబాద్ హైకోర్టు
భారత చిన్నారులపై కోవాక్సిన్ ట్రయల్స్.. ఎక్స్పర్ట్ ప్యానెల్ ఆమోదం
సేవకు ప్రతిరూపాలు వీరే.. చరిత్రలో ఈరోజు
జీ 7 శిఖరాగ్ర భేటీకి మోదీకి ఆహ్వానం.. వెళ్లకూడదని నిర్ణయం
తేహ్రీలో ఆకస్మిక వరదలు.. పెద్ద ఎత్తున నష్టం
1.41 బిలియన్లకు చైనా జనాభా.. రానున్న రోజుల్లో కష్టాలు తప్పవా..?!
పండ్ల రారాజు మామిడితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..