న్యూఢిల్లీ : ఈ-ఫార్మసీ రంగంలో అమెజాన్, రిలయన్స్ సంస్థలకు పోటీగా టాటా సంస్థ అవతరించనున్నది. ఇందుకుగాను ఈ-ఫార్మసీ స్టార్టప్ 1 ఎంజీలో 65 శాతం వాటాలను కొనుగోలు చేయడానికి టాటా సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ.1,200 కోట్లుగా ఉండనున్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం. అయితే, ఈ ఒప్పందంపై వ్యాఖ్యానించేందుకు టాటా సంస్థ ప్రతినిధులు నిరాకరించారు.
1 ఎంజీ సహ వ్యవస్థాపకులు ప్రశాంత్ టాండన్, వికాస్ చౌహాన్, గౌరవ్ అగర్వాల్. ఇది 2015 లో హెల్త్కార్ట్ నుంచి హైవ్ చేయబడింది. ప్రశాంత్ టాండన్, గౌరవ్ అగర్వాల్ తోపాటు 1 ఎంజీ సహ వ్యవస్థాపకులు 1 ఎంజీలోనే ఉండి కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తారని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఇది ఇప్పటివరకు సీక్వోయా, ఐఎఫ్సీ, ఒమిడ్యార్లతో పాటు పలు సంస్థల నుంచి 200 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది.
టాటా సంస్థ ఇటీవల 1.2 బిలియన్ డాలర్ల ఒప్పందం మేరకు ఈ-కిరాణా బిగ్బాస్కెట్లో 64 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ మెగా ఒప్పందాన్ని 15 రోజుల క్రితం సీసీఐ ఆమోదించింది. సూపర్ యాప్ ను తయారు చేస్తున్న టాటా డిజిటల్.. ఆహారం, కిరాణా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, నగలు, ఆర్థిక సేవలు వంటి అన్ని వినియోగదారు ఉత్పత్తులను, సేవలను ఒకే ప్లాట్ఫాంపైకి తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ (రిల్) తర్వాత ఈ-ఫార్మసీని కొనుగోలు చేసిన 2 వ సమ్మేళనంగా టాటా సంస్థ నిలువనున్నది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిల్ గత సెప్టెంబర్లో నెట్మెడ్స్లో 60 శాతం వాటాను దాదాపు రూ.620 కోట్లకు కొనుగోలు చేసింది.
ఎన్నికల్లో ఓడిన మంత్రికి ఉన్నత పదవి.. టీఎంసీలో చేరిన వామపక్ష నేతలు
నౌకలు నిలిచిపోకుండా సూయెజ్ కాలువలో పనులు
కొవిడ్ సెకండ్ వేవ్ వెళ్లిపోయింది.. కానీ, ముప్పు ఇంకా అలాగే ఉంది..
ఎన్నికల విధుల్లో చనిపోయిన వారికి కోటి ఇవ్వాల్సిందే: అలహాబాద్ హైకోర్టు
భారత చిన్నారులపై కోవాక్సిన్ ట్రయల్స్.. ఎక్స్పర్ట్ ప్యానెల్ ఆమోదం
సేవకు ప్రతిరూపాలు వీరే.. చరిత్రలో ఈరోజు
పండ్ల రారాజు మామిడితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..