మెల్బోర్న్ : భారత్కు సహాయం చేయడానికి ఆస్ట్రేలియా కూడా ముందుకొచ్చింది. కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతున్నభారతదేశానికి ఆక్సిజన్, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు పంపనున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య మంత్రి గ్రెగ్ హంట్ సోమవారం తెలిపారు. భారత్కు అత్యవసరంగా ఆదుకునేందుకు సిద్దమని ఇప్పటికే అమెరికా, జర్మనీ, బ్రిటన్ దేశాలు ప్రకటించాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా వారిని అనుసరిస్తూ.. ఉధృతంగా కరోనా కేసులు ఉన్న భారత్ను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. ఆక్సిజన్తో పాటు అవసరమైన అన్ని వైద్య సహాయాలను అందజేస్తామని హామీ ఇచ్చారు.
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ భారతదేశానికి సహాయం అందించారని, ఆస్ట్రేలియా భారత్తో కలిసి ఉన్నదని ఆ దేశ ఆరోగ్య మంత్రి గ్రెగ్ హంట్ అన్నారు. భారతదేశం కష్టతరమైన కొవిడ్ సెకండ్ వేవ్ను ఎదుర్కొంటున్నందున, ఆస్ట్రేలియా భారతదేశానికి సాయం అందిస్తూ తన స్నేహితాన్ని కొనసాగిస్తుందని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి చెప్పారు.
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రో కూడా భారత్కు సహాయం అందించారు. ‘నేను భారత ప్రజలకు సంఘీభావం తెలిపే సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. కరోనాతో ఆ దేశం జరుపుతున్న పోరాటంలో ఫ్రాన్స్ మీకు అండగా ఉంటుది. ఈ సంక్షోభం ఎవరినీ వదిలిపెట్టలేదు. మేం భారత్కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం’ అని మాక్రో ఒక సందేశంలో తెలిపారు.
కరోనా సెకండ్ వేవ్ మీ వల్లే వచ్చింది.. ఈసీకి మద్రాస్ హైకోర్టు మందలింపు
30 ఏండ్లుగా గృహ హింస కేసు లేదు.. కశ్మీర్లోని ఓ ఊరి కథ
సౌదీ నుంచి భారత్కు 80 టన్నుల ఆక్సిజన్
భారీ అణు విషాదానికి 35 ఏండ్లు.. చరిత్రలో ఈరోజు
భారతదేశానికి మద్దతు తెలిపిన జర్మనీ
మూడవ దశ టీకాలకు మార్గదర్శకాలు జారీ
హిమాచల్లో ఏప్రిల్ 27 నుంచి 4 జిల్లాల్లో కర్ఫ్యూ
ఘజియాబాద్లో సిక్కుల ‘ఆక్సిజన్ లాంగర్’
మే నెలలో బాంకులకు 12 సెలవులు.. తగ్గనున్న పని గంటలు
దేశంలోనే ఎత్తైన క్రికెట్ స్టేడియం ఎక్కడంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..