బెంగళూరు: తాను ముఖ్యమంత్రిగా కొనసాగాలా.. వద్దా.. అనే విషయం సోమవారం తేలుతుందని కర్ణాటక సీఎం బీఎస్ యెడియూరప్ప వెల్లడించారు. వచ్చే 10-15 ఏండ్లు బీజేపీ కోసం తాను పని చేస్తానని ఆదివారం చెప్పారు. ఇందులో ఎటువంటి సందేహం లేదని చెప్పారు.
లింగాయత్ స్ట్రాంగ్మ్యాన్గా పేరొందిన బీఎస్ యెడియూరప్ప.. తాను వైదొలిగే విషయమై పార్టీ అధినాయకత్వం నుంచి సందేశం రాలేదని పేర్కొన్నారు. అహర్నిశలు పార్టీ కోసం 10-15 ఏండ్లు పని చేస్తానని, ఇందులో సందేహం లేదన్నారు.
బీజేపీ కేంద్ర నాయకత్వంతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని యెడియూరప్ప తెలిపారు. రెండు నెలల క్రితమే తాను వైదొలుగుతానని చెప్పానని, కానీ అధిష్ఠానమే నచ్చ జెప్పిందన్నారు. హై కమాండ్ నుంచి సందేశం రాకపోతే తాను నిర్ణయం తీసుకుంటానన్నారు.
సీఎంగా తన వారసుడి ఎంపికపై స్పందించడానికి యెడియూరప్ప నిరాకరించారు. దీనిపై బీజేపీ అధిష్టానానిదే తుది నిర్ణయం అన్నారు. తానొక్కడినే సీఎంను నిర్ణయించలేనన్నారు. చివరి క్షణం వరకు తాను పని చేస్తానని చెప్పారు.
Tokyo Olympics: టేబుల్ టెన్నిస్ మూడో రౌండ్లో మనికా బాత్రా
ఇండియా రెజ్లర్ ప్రియా మాలిక్కు గోల్డ్ మెడల్
Tokyo Olympics: మహిళల టెన్నిస్ డబుల్స్లో సానియా జోడీ ఓటమి
Tokyo Olympics: ఆ ముగ్గురు తప్ప.. రెండో రోజు ఇండియాకు నిరాశే
Mirabai Chanu: మీరాబాయి చాను టాప్ 10 ఇంస్టాగ్రామ్ పోస్టులు
భారత్లో టెస్లా యూనిట్.. ఎలన్ మస్క్ ఏమన్నారంటే?
చైనా.. అమెరికాను భారత్ దాటుతుందా.. ముకేశ్ అంబానీ ఏం చెప్పారు?
ITR FY2021-22.. ఇలా ఐటీఆర్ ఫైలింగ్ ఈజీ.. 5 హెడ్స్ కింద ఇన్కం వర్గీకరణ
Home loan Vs Plot loan| ఇంటిపై లోన్ తీసుకోవడం బెటరా.. ఇంటి స్థలంపైనా ? ఏది బెస్ట్ ?