Loksabha Elections 2024 | ధరల పెరుగుదల, వ్యక్తిగత సమస్యలతో పేదలు తమ బంగారాన్ని తాకట్టుపెట్టుకున్నది ఎక్కువగా బీజేపీ హయాంలోనే అని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. పరీక్షల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొన్న యువత కాషాయ పార్టీకి బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
యూపీలోని షహజన్పూర్లో అఖిలేష్ యాదవ్ బుధవారం విలేకరులతో మాట్లాడారు. కోట్లాది మంది ప్రజలు పాలక బీజేపీపై గుర్రుగా ఉన్నారని ప్రజలు తమ ఓట్లను వృధా చేసుకోకుండా బీజేపీతో నేరుగా తలపడుతున్న ఎస్పీకి అనుకూలంగా ఓటేయాలని కోరారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, రిజర్వేషన్, విద్యా రంగాలను పరిరక్షించుకునేందుకు పాటుపడుతున్న ఎస్పీకి బాసటగా నిలవాలని ఆయన పిలుపు ఇచ్చారు.
Read More :
AstraZeneca: మార్కెట్ల నుంచి కోవిడ్ టీకాను వెనక్కి రప్పిస్తున్న ఆస్ట్రాజెనికా