Supreme Court | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఈ నెల 10న సుప్రీంకోర్టును వెలువరించనున్నది. ఈ కేసులో కేజ్రీవాల్ తన అరెస్టును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ధర్మాసనానికి నేతృత్వం వహించిన జస్టిస్ సంజీవ్ కన్నా.. మధ్యంతర ఉత్తర్వులను శుక్రవారం ప్రకటించనున్నట్లు తెలిపారు.
అరెస్టును సవాల్ చేసిన అంశంపై అదే రోజు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. జీఎస్టీకి సంబంధించిన అంశంలో కేంద్రం తరఫున విచారణకు హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు లిస్టింగ్పై వివరణ కోరిన అనంతరం జస్టిస్ ఎంఎం సుందరేష్, బేల ఎం త్రివేదితో పాటు బెంచ్లో కూర్చున్న జస్టిస్ ఖన్నా ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మార్చి 21న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో తిహార్ జైలులో ఉన్నారు.
మే 7న జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై తీర్పును రిజర్వ్ చేసింది. లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వీలుగా ఢిల్లీ సీఎం మధ్యంతర బెయిల్ను కోరారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ, ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్లో పెట్టింది.