టోక్యో: ఇండియన్ టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బాత్రా ఒలింపిక్స్ సింగిల్స్ ఈవెంట్లో మూడో రౌండ్ చేరుకుంది. రెండో రౌండ్లో ఆమె పోరాడి గెలిచింది. 20వ సీడ్ ఉక్రెయిన్ ప్లేయర్ పెసోట్స్కాపై 4-3 గేమ్స్ తేడాతో విజయం సాధించింది. తొలి రెండు గేమ్లను కోల్పోయినా కూడా మనికా అద్భుతంగా పోరాడి 3, 4తోపాటు 6, 7 గేమ్స్లో గెలిచి మ్యాచ్ను సొంతం చేసుకుంది. గంట పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో 4-11, 4-11, 11-7, 12-10, 8-11, 11-5, 11-7 తేడాతో మనికా బాత్రా గెలిచింది.