ముంబై, ఏప్రిల్ 7: మహారాష్ట్రలో కరోనా టీకాలు నిండుకొన్నాయని, వెంటనే పంపించాలని ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేశ్ తోపే కేంద్రప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో రోజుకు 5 లక్షల మందికి వ్యాక్సిన్ ఇస్తున్నామని, ప్రస్తుతం కేవలం 3 రోజుల వ్యాక్సినేషన్కు సరిపడా టీకాలు (14 లక్షలు) మాత్రమే ఉన్నాయని తెలిపారు. టీకాలు పంపించకపోతే రెండో డోసు సకాలంలో ఇవ్వడం కష్టమవుతుందని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ దృష్టికి తీసుకువెళ్లినట్టు రాజేశ్ చెప్పారు. టీకా నిల్వలు లేకపోవడంపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా హర్షవర్ధన్కు ప్రత్యేకంగా లేఖ రాశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందిస్తూ.. మహారాష్ట్రకు 1.06 కోట్ల డోసులు పంపించామని వాటిలో 90 లక్షలు వినియోగించారని తెలిపాయి. బుధవారం మరో 7 లక్షల డోసులు పంపించినట్టు వెల్లడించాయి.
ఇవి కూడా చదవండి..
కఠినమైన పనులతోనే రోజును ప్రారంభిస్తా!
రాధిక, శరత్కుమార్లకు ఏడాది జైలు
లిథియం బ్యాటరీల పనితీరును పెంచే టెక్నిక్