కంగ్టి, జూన్ 14 : జొన్నల కొనుగోలులో ప్ర భుత్వం పూర్తిగా విఫలమైందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి విమర్శించారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కంగ్టిలో పీఏసీఎస్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఇంకా మండలంలో 50శాతం కూడా జొన్నల కొనుగోలు పూర్తికాలేదన్నారు. సంబంధిత అధికారులు, సిబ్బంది నిర్లక్ష్య వైఖరితో ఇంకా చాలామంది రైతులు టోకెన్ల కోసం కార్యాలయం ఎదుట బా రులు తీరుతున్నారని అన్నారు.
ప్రభుత్వం ఆధార్ వెరిఫికేషన్ కోసం కొత్తగా థంబ్ నిబంధ న పెట్టడంతో మహిళలు, వృద్ధులు సైతం కార్యాలయం ఎదుట పడికాపులు కాస్తున్నారని విమర్శించారు. రైతులకు అందుబాటులో గన్నీబ్యాగ్లు లేకపోవడంతో సొంత డబ్బులతో కొనుక్కుకుంటున్నారని తెలిపారు. లారీల కొరత వెం టాడంతో కొంతమంది రైతులు కలిసి లారీలను అద్దెకు తీసుకుని కొనుగోలు కేంద్రాలకు తమ జొన్నలను తరలిస్తున్నారని, జొన్నల కొనుగోలు చేతకాకనే ప్రభుత్వం రైతులను నిబంధనల పేరిట ఇబ్బందులు పెడుతుందన్న ఆయన విమర్శించారు.
కార్యాలయం లో కేవలం రెండు సిస్టమ్లు ఉండడంపై మాజీ ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. దీంతో టోకెన్లు, బిల్లుల అందడం లో జాప్యం జరుగుతున్నదని తెలిపారు. అదనం గా ఇంకా కొన్ని సిస్టమ్లను అందుబాటులోకి తెచ్చి, రైతులకు సకాలంలో బిల్లులు అందేలా చర్యలు తీసుకోవాలని సీఈవో రమేశ్కు సూచించారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం రేవంత్రెడ్డి వరంగల్ డిక్లరేషన్లో భాగంగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే వెంట మాజీ ఎంపీపీ వెంకట్రెడ్డి, సర్పంచ్ కృష్ణముదిరాజ్, బీఆర్ఎస్ నాయకులు రాజేందర్, గూలే సతీశ్ తదితరులు ఉన్నారు.