న్యూఢిల్లీ: కరోనా కట్టడిలో తమ పొరపాట్లను కప్పిపుచ్చుకోవడానికి మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తున్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ ఆరోపించారు. దీంట్లోభాగంగానే కావల్సినన్ని టీకాలు లేవని చెబుతున్నారని, 18 ఏండ్లు నిండిన అందరికీ టీకా వేయాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. అవసరమైన వారికి పూర్తి స్థాయిలో టీకాను ఇవ్వకుండా మిగతావారికి ఇప్పుడే వ్యాక్సిన్ ఎలా వేస్తామని ప్రశ్నించారు. వ్యాక్సిన్ల కొరత ఉందన్న వాదన పూర్తిగా అవాస్తవమన్నారు. మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా కట్టడికి సరైన చర్యలు తీసుకోవటం లేదన్నారు.
ఇవి కూడా చదవండి..
కఠినమైన పనులతోనే రోజును ప్రారంభిస్తా!
రాధిక, శరత్కుమార్లకు ఏడాది జైలు
లిథియం బ్యాటరీల పనితీరును పెంచే టెక్నిక్