లక్నో : హోలీ వేడుకల్లో పాల్గొనేందుకు వలస కూలీలు స్వస్దలాలకు తిరిగివచ్చే సమయంలో కొవిడ్-19 కేసులు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. corona వైరస్ వ్యాప్తిని నిరోధించే క్రమంలో యూపీ ప్రభుత్వం ముందస్తు అనుమతులు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో Holi వేడుకల్లో గుమికూడటం, ప్రదర్శనలను నిషేధించింది. పదేండ్ల లోపు చిన్నారులు, 60 ఏండ్లు పైబడిన వారిని హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది.
మాస్క్లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను అనుసరిస్తూ ప్రజలు హోలీ వేడుకల్లో పాల్గొనేలా అన్ని చర్యలూ చేపట్టాలని అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖలు రాశారు. మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీ వంటి కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాల నుంచి యూపీలోకి వచ్చేవారు విధిగా కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేశారు.
కొవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో సెకండ్ వేవ్పై ఆందోళన నెలకొందని, హోలీ వేడుకల్లో ప్రజలు కరోనా మార్గదర్శకాలను పాటించి అప్రమత్తంగా వ్యవహరించాలని అదనపు ముఖ్య వైద్యాధికారి డాక్టర్ రాజీవ్ గుప్తా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రీపోల్ సర్వేలను చూసి అలసత్వం వద్దు : పినరయి విజయన్
ఫేస్బుక్ కొత్త రిస్ట్బ్యాండ్.. మెదడుతో కంప్యూటర్ల నియంత్రణ
మోదీ 115 స్కీంలు తెస్తే.. మమతా 115 స్కాంలు చేశారు : అమిత్షా
ట్యాక్స్ సేవింగ్స్ చేయాలా..? ఈ టిప్స్ పాటించండి!
ఇది యూఎఫ్ఓ కాదు.. రష్యా కార్గో ఎయిర్షిప్..!
ఆర్టిస్ట్ లండన్లో.. మహిళ నెదర్లాండ్స్లో.. 5 జీ టెక్నాలజీ టాటూ
భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల ఉరితీత.. చరిత్రలో ఈరోజు
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.