తిరువనంతపురం : ప్రీపోల్సర్వేలు కేవలం అభిప్రాయాలే.. వాటిని చూసి అలసత్వం వహిస్తే మొదటికే మోసం వస్తుందని కేరళ ఎల్డీఎఫ్ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి పినరయి విజయన్.. తమ పార్టీ క్యాడర్కు సూచించారు.
ప్రీపోల్ సర్వేలు మనకు బూస్టింగ్ ఇవ్వాలే.. కానీ, వాటిని చూసి ప్రచారం చేయకుండా వదిలేస్తే ఓటమి తప్పదన్నారు.
ప్రస్తుతం కేరళ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో మరోసారి ఎల్డీఎఫ్ అధికారంలోకి రానున్నదని పలు ప్రీపోల్ సర్వేలు స్పష్టం చేశాయి. అయితే, కొన్ని సీట్లలో బీజేపీ గట్టిపోటీ ఇస్తుందని సర్వేలు వెల్లడించాయి.
ఈ నేపథ్యంలో సర్వే ఫలితాలతో బద్దకం వస్తుందని, అలాకాకుండా ప్రతి ఇంటికి కార్యకర్త వెళ్లి మన ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేయాలని మంగళవారం నాడు నాయకులకు పినరయి విజయన్ సూచించారు.
‘ఎలక్షన్ అంటేనే బ్లేమ్ గేమ్.. పలు సర్వే నివేదికలు వెలువడ్డాయి.. వీటిని చూసి ఆనందించకుండా పార్టీ అభ్యర్థుల విజయం కోసం కార్యకర్తలు కృషిచేయాలి. లేదంటే సర్వే ఫలితాలు తారుమారవుతాయి’ అని పినరయి విజయన్ అన్నారు.
లెఫ్ట్ ప్రభుత్వం అవినీతిని ప్రశ్నించని మీడియా.. వారిచ్చే అవినీతి సొమ్ము ప్రకటనలతో కిమ్మనకుండా ఉంటున్నాయని కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితల సోమవారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సీఎం విజయన్ ఈ మేరకు ఇలా కార్యకర్తలకు సూచించినట్లు మీడియాకు చెప్పారు.
ఎన్నో ఇబ్బందులకు ఓర్చి తమ ప్రభుత్వం ప్రజాసంక్షేమ కార్యక్రమాలను చేపట్టి ప్రజల్లో మంచిపేరు తెచ్చుకున్నదని, అందుకే మరో దఫా అధికారం కట్టబెట్టేందుకు ప్రజలు సుముఖంగా ఉన్నారని విజయన్ పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు, విమర్శలను ప్రసారం చేయకుండా మీడియా నిజాలను ప్రజలకు అందించాలని కోరారు.
ఇవి కూడా చదవండి..
ఫేస్బుక్ కొత్త రిస్ట్బ్యాండ్.. మెదడుతో కంప్యూటర్ల నియంత్రణ
మోదీ 115 స్కీంలు తెస్తే.. మమతా 115 స్కాంలు చేశారు : అమిత్షా
ట్యాక్స్ సేవింగ్స్ చేయాలా..? ఈ టిప్స్ పాటించండి!
ఇది యూఎఫ్ఓ కాదు.. రష్యా కార్గో ఎయిర్షిప్..!
ఆర్టిస్ట్ లండన్లో.. మహిళ నెదర్లాండ్స్లో.. 5 జీ టెక్నాలజీ టాటూ
భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల ఉరితీత.. చరిత్రలో ఈరోజు
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.