ఏసీల్లో కూర్చుని ట్వీట్లు చేసే నేతను కాలేను: ఊర్మిళ

హైదరాబాద్: బాలీవుడ్ నటి ఊర్మిళ ఇటీవల శివసేన పార్టీలో చేరిన విషయం తెలిసిందే. గత లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిన ఆమె.. ఈమధ్యే పార్టీ మారారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పిన ఊర్మిళ.. శివసేన పార్టీ నుంచి ప్రస్తుతం మహారాష్ట్ర మండలి కోసం పోటీలో ఉన్నారు. అయితే తనకు ఏసీల్లో కూర్చుని ట్వీట్లు చేసే నేతలాగా మారాలని లేదని ఊర్మిళ అన్నారు. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం అద్భుతంగా ఉందని, కోవిడ్ మహమ్మారి వేళ ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ చర్యలు అసాధారణమైనవని ఆమె అన్నారు. సెక్యూలర్ అన్న భావాలకు అర్ధాలు మారాయని, సెక్యూలర్ అన్నంత మాత్రాన మరో మతంపై నమ్మకం లేదని కాదు అని, హిందువుగా ఉన్నంత మాత్రాన మరో మతాన్ని ద్వేషించలేమని, శివసేన అనేది హిందుత్వ పార్టీ అని, హిందూ మతం గొప్పదని ఊర్మిళ అన్నారు. ప్రజా నేత కావాలన్నదే తన లక్ష్యమని, తాను ఎలా అయితే అభిమానులతో సినీ స్టార్గా మారానో అలాగే ప్రజా నాయకురాలు అనిపించుకోవాలని ఉందన్నారు. ఏసీల్లో కూర్చుని ట్వీట్లు చేయడం కాదు, ఏం చేయాలి, ఎలా చేయాలో తెలుసని, తానెప్పుడూ నేర్చుకుంటూనే ఉంటానని ఆమె అన్నారు.
తాజావార్తలు
- ..ఆ రెండు రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : మాయవతి
- సంక్రాంతి స్పెషల్.. పవన్ కళ్యాణ్ ఇంట్లో రామ్ చరణ్..
- ‘వకీల్ సాబ్’ బడ్జెట్ శాటిలైట్ రైట్స్తోనే వచ్చేసిందా..?
- మీరెవరికి మద్దతిస్తున్నారు: మీడియాపై నితీశ్ చిందులు
- ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..క్రాక్ నటుడి మనోగతం
- కుక్కపై లైంగిక దాడి.. ఓ వ్యక్తి అరెస్ట్
- మోదీ పాలనలో సుప్రీంకోర్టుపై నమ్మకం పోయింది: కె. నారాయణ
- చిరంజీవి బిగ్ సర్ప్రైజ్.. 2021లో డబుల్ డోస్ ఇస్తున్నాడా..?
- హైదరాబాద్-చికాగో నాన్స్టాప్ విమాన సర్వీసులు ప్రారంభం
- ‘క్రాక్’ 5 రోజుల కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ డన్.. లాభాలు ఆన్