టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబును కరోనా వ్యాక్సిన్స్ అందజేస్తామని ఓ వ్యక్తి మోసం చేసిన విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. సదరు వ్యక్తి తన దగ్గర కరోనా వ్యాక్సిన్లు ఉన్నాయని సురేష్ బాబు ఆఫీస్కు ఫోన్ చేయగా..సురేష్ బాబు మేనేజర్అతని మాటలు నమ్మి లక్ష రూపాయలు ట్రాన్స్ ఫర్ చేశాడు . అయితే డబ్బులు ట్రాన్స్ ఫర్ చేశాక కేటుగాడికి ఫోన్ చేయడంతో అతని ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో అతనిపై అనుమానం వచ్చి జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తాజా సమాచారం ప్రకారం పోలీసులు సురేశ్ బాబుకు టోకరా వేసిన నిందితుడిని నాగార్జునగా గుర్తించి..ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారట. నిందితుడు నాగార్జున భార్య ఖాతాకు సురేశ్ బాబు మేనేజర్ డబ్బులు పంపించినట్టు తెలుస్తోంది. నాగార్జున ఇదే పద్దతిలో మరికొంతమందిని మోసం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.
ఇవి కూడా చదవండి..
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
రాజా విక్రమార్క టైటిల్తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!