Yashaswini Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అసహనం పెరిగిపోతుంది. ఆరు గ్యారంటీల పేరుతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా మోసం చేయడంపై విరుచుకుపడుతున్నారు. హస్తం పార్టీ నాయకుల తీరుపై సాధారణ ప్రజలు మాత్రమే కాదు.. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎదురుగా మహిళా కార్యకర్త ఆగ్రహంతో రెచ్చిపోయారు.
పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తిలో గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసాలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డ తమకు గుర్తింపు ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై గొడవకు దిగారు. సొంత పార్టీ కార్యకర్తలే ఇలా ఎదురు తిరగడంతో ఏమీ చేయాలో తెలియని స్థితిలో బిక్క మొహం వేసుకుని ఉండిపోయారు. కాగా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కలుగజేసుకుని మహిళా కార్యకర్తలకు నచ్చజెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది.
కాంగ్రెస్ పార్టీ మోసాలకు పాల్పడుతుందని విరుచుకు పడ్డ మహిళ .. తెల్ల ముఖం వేసుకున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీటింగ్ జరిగింది.
అయితే కొంతమంది మహిళా… pic.twitter.com/mvlxDO7qF9
— Telugu Scribe (@TeluguScribe) April 25, 2024