న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య(MP Tejasvi Surya) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించే ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ బ్రిటీషర్ల కన్నా నీచమైన రీతిలో వ్యవహరించినట్లు ఆరోపించారు. ఇండియా , పాకిస్థాన్ను విడగొట్టినట్లుగా ఆంధ్రా, తెలంగాణను విభజించారని ఎంపీ సూర్య ఆరోపించారు. లోక్సభలో ఇవాళ రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశవిభజనతో పోల్చడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Tejasvi Surya : The division of Andhra and Telangana by UPA is worse than the India-Pakistan division by the British
People fought & sacrificed for formation of Telangana, and this person mocking & comparing it to Pakistan. What a D!sgusting person 🥴
— Veena Jain (@Vtxt21) April 16, 2026
ఇవికూడా చదవండి>>