హైదరాబాద్ : పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ( BJP MP Tejasvi ) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలు అవివేకంగా ఉన్నాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ( Niranjan Reddy ) ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ ( Apology ) చెప్పాలని డిమాండ్ చేశారు. మిడిమిడి జ్ఞానం, అవగాహనా లేమితో బీజేపీ ఎంపీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద అవాకులు, చెవాకులు పేలుతున్నారని విమర్శించారు.
ఉద్దేశపూర్వకంగా బీజేపీ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మీద దాడి చేస్తున్నదిభారత రాజ్యాంగానికి లోబడి దేశ అత్యున్నత పార్లమెంట్ ఆమోదంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, తెలంగాణ రాష్ట్రం అమరుల త్యాగాలు, ప్రజల ఆకాంక్షల ఫలితమని అన్నారు.
దశాబ్దాల పోరాటం మూలంగా తెలంగాణ సాక్షాత్కరించిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ఓట్లతో ఎంపీలుగా ఎన్నికైన 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు తేజస్వీ సూర్య వ్యాఖ్యలను ఖండించాలని డిమాండ్ చేశారు.