Ayodhya | ప్రముఖ ఆధ్యాత్మిక నగరం అయోధ్య (Ayodhya) భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన అయోధ్యలో నిర్మించిన రామ మందిరం ప్రారంభోత్సవం జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రామమందిరం ప్రారంభోత్సవానికంటే ముందు అంటే ఈనెల 30వ తేదీన అయోధ్య నగరంలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయం, రైల్వే స్టేషన్ల ప్రారంభించనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా వీటిని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) పర్యటనను దృష్టిలో పెట్టుకొని అధికారులు నగరంలో గట్టి బందోబస్తు ఏర్పాటు (Security heightened) చేశారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్తో నగంలో అణువణువునా గాలిస్తున్నారు.
#WATCH | UP: Security heightened in Ayodhya ahead of Prime Minister Narendra Modi’s visit. pic.twitter.com/MzFj4ICpKZ
— ANI (@ANI) December 28, 2023
యావత్తు భారతావని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ (UP) లోని అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరుగనున్నది. రామాలయం ప్రారంభోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా దేశంలోని పలు రాజకీయ పార్టీల నేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పారిశ్రామిక వేత్తలు, ఆధ్యాత్మిక గురువులు మొత్తం 6 వేల మందికిపైగా ప్రముఖులు హాజరుకానున్నారు.
Uttar Pradesh| Preparations underway for the inauguration of the Ayodhya airport
Prime Minister Narendra Modi will inaugurate the Ayodhya Airport on December 30 pic.twitter.com/1wrwQdTmCH
— ANI (@ANI) December 28, 2023
Also Read..
Ayodhya Ram Temple | అయోధ్యకు చేరుకున్న 620 కిలోల బరువున్న గంట
Ayodhya | అయోధ్యలో డ్రెయిన్లు, రోడ్లు శుభ్రం చేసిన యూపీ డిప్యూటీ సీఎం