అమృత్ సర్: (OSD’s tweet) పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓఎస్డీ చేసిన ట్వీట్ పంజాబ్లో సంచలనం రేపుతున్నది. తాజాగా ట్విట్టర్లో అమరీందర్ సింగ్ గురించి పోస్ట్ చేయడం ద్వారా కొత్త రాజకీయ వివాదానికి ఆయన ఓఎస్డీ కారణమయ్యారు. మాజీ ముఖ్యమంత్రి ఓఎస్డీగా నరేందర్ భాంబ్రి ఉన్నారు.
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కెప్టెన్ అమరీందర్ సింగ్ తదుపరి ఇన్నింగ్స్ కోసం పంజాబ్ రాజకీయ వర్గాలు మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఆయన ఓఎస్డీ చేసిన ట్వీట్ సంచలనం రేపుతున్నది. ‘మరింత గొప్పగా తిరిగొస్తున్నారు..’ అంటూ కెప్టెన్ ఓఎస్డీ నరేందర్ భాంబ్రి పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ పంజాబ్లో రాజకీయంగా దుమారం రేపుతున్నది. ఈ పోస్ట్ చదివిన ప్రతీ ఒక్కరూ కనుబొమ్మలు ఎగరేస్తున్నారు. కెప్టెన్ మళ్లీ ఎలా తిరిగి వస్తున్నారు? ఆయనను ఏ పదవిలో కూర్చోబెడుతున్నారు? అని సర్వత్రా చర్చించుకుంటున్నారు.
సెప్టెంబర్ 18 న పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. తనకు అవమానం జరిగినట్లు భావించి పదవి నుంచి తప్పుకున్నానని అమరీందర్ సింగ్ చెప్పారు.
ఆయన రాజీనామా చేసినప్పటి నుంచి కెప్టెన్ రాజకీయ భవిష్యత్పై రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. రాజీనామా పత్రాన్ని సమర్పించిన అనంతరం తన మద్దతుదారులను సంప్రదించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని కెప్టెన్ చెప్పారు.
కొత్త విదేశాంగ మంత్రిగా నారాయణ్ ఖడ్కా
‘ఘాజీల భూమిపై గర్జిద్దాం’.. వివాదంలో ఎంఐఎం పోస్టర్
పడిపోయిన ఆర్-వ్యాల్యూ.. మందగించిన కొవిడ్ వ్యాప్తి
శ్రీరాముడి బస ఆధారంగా కొత్త టూరిజం సర్క్యూట్
వ్యాక్సిన్లపై యువకుడి వినూత్న ప్రమోషన్.. ఎక్కడంటే?
మెక్డోనాల్డ్స్ బర్గర్లో తేలు.. కేసు నమోదు
లక్షల మందిని బలిగొన్న ఇరాన్-ఇరాక్ యుద్ధానికి 41 ఏండ్లు
ఈ పాప.. తొలి ‘ఆన్లైన్ బేబీ’.. ఎలాగంటే?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..