న్యూఢిల్లీ: (R-Value) భారతదేశ ప్రజలకు శుభవార్త. మన దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ ఆర్-వ్యాల్యూ పడిపోయింది. కొవిడ్ వ్యాప్తి మందగించిపోయింది. ఈ విషయాలను అధ్యయనకారులు వెల్లడించారు. ఆగస్టు నెలాఖరులో 1.17 నుంచి సెప్టెంబర్ మధ్యలో 0.92 కి పడిపోయింది. ఇది దేశవ్యాప్తంగా సంక్రమణ వ్యాప్తి మందగించిన విషయాన్ని సూచిస్తుంది. ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరులలో 1 కంటే ఎక్కువగా ఉండగా.. ఢిల్లీ, పుణెలలో 1 కంటే తక్కువగా ఉన్నాయి. అత్యధిక సంఖ్యలో యాక్టీవ్ కేసులు ఉన్న రెండు రాష్ట్రాలు మహారాష్ట్ర, కేరళకు ఉపశమనం కలిగించేలా.. ఇక్కడ ఆర్-వ్యాల్యూ 1 కంటే తక్కువగా ఉన్నాయి.
ఆగష్టు చివరిలో ఆర్-వ్యాల్యూ 1.17 గా ఉండగా.. సెప్టెంబర్ 4-7 తేదీల మధ్య 1.11 కి క్షీణించింది. అప్పటి నుంచి ఇది 1 లోపు ఉన్నది. భారతదేశంలో ఆర్-వ్యాల్యూ 1 కంటే తక్కువగా కొనసాగుతుండటం సంతోషకరమైన వార్త అని చెన్నైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ సీతాభ్రా సిన్హా పేర్కొన్నారు. ఆర్-వ్యాల్యూను లెక్కించే పరిశోధకుల బృందానికి సిన్హా నాయకత్వం వహిస్తున్నారు. కేరళ, మహారాష్ట్రల్లో అత్యధిక సంఖ్యలో క్రియాశీల కేసులు ఉన్నప్పటికీ ఆర్-వ్యాల్యూ పడిపోవడం శుభసూచకమని ఆయన చెప్తున్నారు. వీరి డాటా ప్రకారం, ముంబై ఆర్-వ్యాల్యూ 1.09, చెన్నై 1.11, కోల్కతా 1.04, బెంగళూరు 1.06 గా ఉన్నాయి. కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు, దేశంలో ఆర్-వ్యాల్యూ మార్చి 9 నుంచి ఏప్రిల్ 21 మధ్య 1.37 గా అంచనా వేశారు. ఇది ఏప్రిల్ 24 నుంచి మే 1 వరకు 1.18 కి తగ్గింది. అనంతరం ఏప్రిల్ 29 నుంచి మే 7 మధ్య 1.10 కి పడిపోయింది.
సెప్టెంబర్ 4-7 మధ్య ఆర్-వ్యాల్యూ 0.94, సెప్టెంబర్ 11-15 మధ్య 0.86, సెప్టెంబర్ 14-19 మధ్య 0.92 గా ఉన్నట్లు వీరి అధ్యయనాలు చెప్తున్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, రికవరీ రేటు ప్రస్తుతం 97.75 శాతంగా ఉన్నది. గత 88 రోజులుగా వీక్లీ పాజిటివిటీ రేటు (2.08 శాతం) 3 శాతం కంటే తక్కువగా ఉండటం ఊరటనిచ్చే విషయం.
వ్యాక్సిన్లపై యువకుడి వినూత్న ప్రమోషన్.. ఎక్కడంటే?
మెక్డోనాల్డ్స్ బర్గర్లో తేలు.. కేసు నమోదు
లక్షల మందిని బలిగొన్న ఇరాన్-ఇరాక్ యుద్ధానికి 41 ఏండ్లు
రైల్వే ఆన్లైన్ టికెట్ బుకింగ్లో బగ్.. గుర్తించిన 17 ఏండ్ల కుర్రోడు!
ఈ పాప.. తొలి ‘ఆన్లైన్ బేబీ’.. ఎలాగంటే?
తస్వీర్ స్క్రీనింగ్కు ఎంపికైన ‘నాను లేడీస్’.. కన్నడ లెస్బియన్ లవ్ స్టోరీ