జైపూర్ : (McDonald’s) ఓ యువకుడు బర్గర్ కొని నోట్లో పెట్టుకొని బైట్ చేశాడు. అంతే దాంట్లో నుంచి తేలు బయటకు వచ్చింది. భయపడిపోయిన సదరు యువకుడు దవాఖాన పాలయ్యాడు. అనంతరం రెస్టారెంట్పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. వివరాల్లోకెళితే..
రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరంలోని మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్కు ఈ నెల 17 న తరుణ్ సైనీ అనే యువకుడు స్నేహితుడితో కలిసి బర్గర్ తినేందుకు వెళ్లాడు. రెండు బర్గర్ల ఆర్డర్ చేశారు. బర్గర్ టేబుల్పైకి రాగానే నోట్లో పెట్టి కొరికాడు. సగం తిన్న తర్వాత రుచిలో తేడా కనిపించింది. అదేంటో అనుకుంటూనే రేపర్ ఒపెన్ చేయగా దానిలో నుంచి నల్ల తేలు బయటపడింది. బర్గర్లో తేలును చూడగానే తరుణ్ భయపడిపోయాడు. ఈ విషయాన్ని రెస్టారెంట్ నిర్వాహకులకు చేరవేశారు. దాంతో అక్కడ ఉన్న సిబ్బంది వీరి చేతుల్లో నుంచి బర్గర్ లాక్కొని వెళ్లిపోయారు. 100 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా.. జవహర్ సర్కిల్ పోలీసులు రెస్టారెంట్కు చేరుకుని తేలు బయటపడినట్లు చెప్తున్న బర్గర్ను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. బర్గర్ సగం తిన్న తరుణ్ సైనీని జైపురా శాటిలైట్ దవాఖానాలో చేర్చించి చికిత్స అందించారు. తరుణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్పై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
లక్షల మందిని బలిగొన్న ఇరాన్-ఇరాక్ యుద్ధానికి 41 ఏండ్లు
రైల్వే ఆన్లైన్ టికెట్ బుకింగ్లో బగ్.. గుర్తించిన 17 ఏండ్ల కుర్రోడు!
ఈ పాప.. తొలి ‘ఆన్లైన్ బేబీ’.. ఎలాగంటే?
తస్వీర్ స్క్రీనింగ్కు ఎంపికైన ‘నాను లేడీస్’.. కన్నడ లెస్బియన్ లవ్ స్టోరీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..