న్యూఢిల్లీ : (Bug in IRCTC) ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫాంలో బగ్ బయటపడింది. ఈ బగ్ భారతీయ రైల్వేల్లో టిక్కెట్లు కొనుగోలు చేసి ప్రయాణించే వారి ప్రైవేట్ సమాచారాన్ని బహిర్గతపరిచేదిగా ఉన్నట్లు తేలింది. ఈ బగ్ను చెన్నైకి చెందిన ఓ 17 ఏండ్ల కుర్రోడు గుర్తించి ఐఆర్సీటీసీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సీఈఆర్టీ) అధికారులు వెంటనే రంగంలోకి దిగి బగ్ను తొలగించి సమస్యను పరిష్కరించారు. దాంతో దేశంలోనే అతిపెద్ద ఆన్లైన్ టికెట్ రిజర్వేషన్ పోర్టల్ నుంచి కోట్ల మంది వినియోగదారుల రికార్డులను హ్యాక్ చేయకుండా నిరోధించగలిగారు.
చెన్నైలోని తాంబరంకు చెందిన 12 వ తరగతి విద్యార్థి పీ రెంగనాథన్.. కొన్ని రోజుల క్రితం ఐఆర్సీటీసీ పోర్టల్లోకి లాగిన్ అయి రైలు టిక్కెట్ రిజర్వ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో అతను వ్యవస్థలో కొన్ని లోపాల వల్ల సమస్యలను ఎదుర్కొన్నాడు. ప్రయాణికుడి పేరు, వయస్సు తదితర వ్యక్తిగత వివరాలు, పీఎన్ఆర్ నంబర్, రైలు పేరు, బయలుదేరే స్టేషన్, ప్రయాణ డాటా వంటి ప్రయాణ సంబంధ వివరాలను యాక్సెస్ చేసేలా వ్యవస్థలో లోపం ఉన్నట్లు గుర్తించాడు. ఈ లోపం కారణంగా హ్యాకర్లు ప్రయాణికుల టిక్కెట్లను వారికి తెలియకుండానే రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని, దీని వల్ల కోట్ల మంది ప్రయాణికుల డాటా లీకయ్యే ప్రమాదం ఉన్నదని రెంగనాథన్, ఐఆర్సీటీసీకి తెలిపాడు.
రెంగనాథన్ ఈ విషయాన్ని గత నెల 30 న లేవనెత్తగా.. సీఈఆర్టీ సిబ్బంది వెంటనే స్పందించి లోపాన్ని గుర్తించి సరిచేశారు. ఈ సమస్యను ఐదు రోజుల్లోనే పరిష్కరించినట్లు ఐఆర్సీటీసీ పేర్కొన్నది.
ఈ పాప.. తొలి ‘ఆన్లైన్ బేబీ’.. ఎలాగంటే?
సరైస సమయంలో జనాభా నియంత్రణ బిల్లు : యోగి ఆదిత్యనాథ్
గవర్నర్-ముఖ్యమంత్రి మధ్య మళ్లీ మొదలైన జగడం
తస్వీర్ స్క్రీనింగ్కు ఎంపికైన ‘నాను లేడీస్’.. కన్నడ లెస్బియన్ లవ్ స్టోరీ
మతపరమైన నిర్మాణాల రక్షణ బిల్లును తెచ్చిన కర్నాటక
శరద్ పవార్ వెన్నుపోటుదారు: అనంత్ గీతే
జలాలాబాద్లో 35 మంది తాలిబాన్లు మృతి : ఐసిస్ ఖోరాసన్
పాక్లో సివిల్స్కు ఎంపికైన హిందూ యువతి
వృద్ధులను వేధిస్తున్న మతిమరుపు సమస్య.. ఎందుకలా?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..