లక్నో : పెరుగుతున్న జనాభా అభివృద్దికి అడ్డంకి అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) అభిప్రాయపడ్డారు. జనాభా నియంత్రణపై ‘సరైన సమయంలో’ చట్టం తీసుకొస్తామని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో జనాభాను స్థిరీకరించడం, మాతాశిశు మరణాలను తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం జూలైలో ఒక విధానాన్ని ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ లా కమిషన్ ముసాయిదా బిల్లును ప్రభుత్వానికి అందించిందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతిదీ తగిన సమయంలో జరుగుతుందని మీడియాతో చిట్చాట్ సందర్భంగా చెప్పారు.
రామ మందిరం నిర్మాణం ఎప్పుడంటూ మీడియా బీజేపీని ప్రశ్నించేదని, అయితే, కొవిడ్ వ్యాప్తి ఉన్నప్పటికీ మోదీ ఆలయ పనులకు శంకుస్థాపన చేశారని యోగి ఆదిత్యనాథ్ గుర్తుచేశారు. ఆర్టికల్ 370 కూడా రద్దు చేసి జమ్ముకశ్మీర్కు ప్రత్యేక హోదాను తొలగించి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను తయారుచేశారని చెప్పారు. అబ్బాజాన్ గురించి ప్రశ్నించగా.. ప్రతిపక్షాలకు ముస్లింల ఓట్లు కావాలి, కానీ అబ్బాజాన్ గురించి పట్టించుకోవని విమర్శించారు. జనాభా నియంత్రణ చట్టాన్ని నిశ్శబ్దంగా తీసుకురామని, మీడియా సాయంతో ఆర్బాటంగా తీసుకొస్తామన్నారు.
జూలై నెలలో జనాభా నియంత్రణపై ముసాయిదా బిల్లును ఉత్తరప్రదేశ్ లా కమిషన్ వెబ్సైట్లో ఉంచిందని, ఈనెల 19 వరకు సలహాలు స్వీకరించినట్లు తెలిపారు. ఈ బిల్లు అమలులోకి వస్తే రానున్న రోజుల్లో ఉత్తరప్రదేశ్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వ్యక్తులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయడం, ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడం, ప్రభుత్వ సబ్సిడీలు పొందడం నుంచి పక్కకు తప్పిస్తారని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతులను కూడా నిషేధించడం కూడా తీసుకొస్తామన్నారు. ఇద్దరు పిల్లలకే పరిమితమైన వారికి ప్రోత్సాహకాలను అందిస్తుందని చెప్పారు.
గవర్నర్-ముఖ్యమంత్రి మధ్య మళ్లీ మొదలైన జగడం
తస్వీర్ స్క్రీనింగ్కు ఎంపికైన ‘నాను లేడీస్’.. కన్నడ లెస్బియన్ లవ్ స్టోరీ
మతపరమైన నిర్మాణాల రక్షణ బిల్లును తెచ్చిన కర్నాటక
శరద్ పవార్ వెన్నుపోటుదారు: అనంత్ గీతే
జలాలాబాద్లో 35 మంది తాలిబాన్లు మృతి : ఐసిస్ ఖోరాసన్
పాక్లో సివిల్స్కు ఎంపికైన హిందూ యువతి
వృద్ధులను వేధిస్తున్న మతిమరుపు సమస్య.. ఎందుకలా?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..