బెంగళూరు : (Karnataka) రాష్ట్రంలో అన్ని మతాలకు చెందిన మతపరమైన నిర్మాణాలకు రక్షణ కల్పించాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని మతపరమైన నిర్మాణాల రక్షణ బిల్లు-2021 ని కర్నాటక ప్రభుత్వం తీసుకురానున్నది. ఈ మేరకు బిల్లును ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మతపరమైన స్థలాల తొలగింపునకు సంబంధించి ఏదైనా కేసు న్యాయస్థానంలో పెండింగ్లో ఉంటే రాష్ట్రం రక్షణ కల్పించదని బిల్లులో పేర్కొన్నారు. రక్షిత నిర్మాణాల్లో మతపరమైన కార్యకాలపాలు.. ఆచారం, చట్టం, వినియోగానికి లోబడి ఉంటాయని కూడా స్పష్టం చేసింది.
ఇటీవల మైసూర్లోని నంజన్గూడలో ఓ ఆలయం కూల్చివేత నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువస్తున్నది. ‘మత సామరస్యాన్ని కాపాడుతూ ప్రజల మత భావాలను దెబ్బతినకుండా ఉండేందుకు ఈ చట్టం అమలులోకి రావడానికి ముందు బహిరంగ ప్రదేశాల్లో నిర్మించిన మతపరమైన నిర్మాణాలకు రక్షణ కల్పించడం అవసరం. భవిష్యత్లో బహిరంగ ప్రదేశాల్లో అనధికార మతపరమైన నిర్మాణాలను పరిమితం చేసేందుకు ఈ చట్టం వీలుకల్పిస్తుంది’ అని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో అనధికార మత పరమైన నిర్మాణాలకు అధికారులు ఇకపై అనుమతి ఇవ్వరని పేర్కొన్నది.
‘దేవాలయాలను కూల్చేది వారే. ఇప్పుడు వారే వాటిని రక్షిస్తామని చెప్తున్నారు. తమ చేష్టలతో ప్రజలను మూర్ఖులుగా చేస్తున్నారు. ఇది కేవలం ఓటు బ్యాంకు కోసమే జరుగుతున్నది. ప్రతిదీ చట్టబద్ధం కానప్పుడు.. బిల్లు పెట్టడానికి ముందు విపులంగా చర్చించి ఉండాల్సింది కదా’ అని కర్నాటక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎన్ హారిస్ అన్నారు.
శరద్ పవార్ వెన్నుపోటుదారు: అనంత్ గీతే
జలాలాబాద్లో 35 మంది తాలిబాన్లు మృతి : ఐసిస్ ఖోరాసన్
పాక్లో సివిల్స్కు ఎంపికైన హిందూ యువతి
వృద్ధులను వేధిస్తున్న మతిమరుపు సమస్య.. ఎందుకలా?
2-3-4 ఫార్ములాతో బీపీ కంట్రోల్.. ఎలాగంటే?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..