(Blood Pressure) అధిక రక్తపోటు ‘నిశ్శబ్ద హంతకి’.. పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకుండనే లోలోపల తీవ్ర అనర్థాలకు దారితీస్తుంది. కండ్ల నుంచి కాళ్ల వరకు అన్ని అవయవాలను దెబ్బతీస్తుంది. సాధారణంగా ఆరోగ్యవంతుల రక్తపోటు సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 90 నుంmr 120 మి.మీ గాను, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 60 నుంచి 80 మి.మీ గాను నమోదు కావాలి. రక్త పోటు 130/90 మి.మీ, అంతకన్నా ఎక్కువగా ఉన్నప్ఫుడు అధిక రక్తపోటుగా భావిస్తుంటారు. మనిషి వయసు పెరిగే కొద్ది బీపీలో మార్పు వస్తుంటుంది.
రక్తపోటు కారణంగా దేశం ఏటా సగటున 16 లక్షలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఒత్తిడి, ఇన్ఫెక్షన్, కొన్ని రకాల మందులు, శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల రక్తపోటు దరి చేరుతుంది.రక్తపోటు నిరంతర సమస్య కారణంగా గుండె, మూత్రపిండాలు వంటి అవయవాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. అధిక రక్తపోటుతో రక్తనాళాలు దెబ్బతినటం, గుండె సంబంధ సమస్యలు, పక్షవాతం, కిడ్నీజబ్బు వంటి ఇబ్బందులు పొంచి ఉంటాయి. అందువల్ల రక్తపోటును అదుపులో ఉంచుకోవటం ఎంతో అవసరం. అయితే, రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి 2-3-4 ఫార్ములాను ఆచరించడం చాలా ఉత్తమం అని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఈ ఫార్ములాలో 2 యోగాసనాలు, 3 రకాల వ్యాయామాలు, 4 రకాల పండ్లు ఉన్నాయి.
అధిక రక్తపోటును నివారించేందుకు యోగా ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది. వీటిలో ముఖ్యంగా సేతుబంధాసనం, మత్స్యాసనం ఎంతో ప్రధానమైనవి. ఈ రెండు రకాల యోగాసనాలను నిత్యం ఆచరించడం వల్ల శరీరంలో రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. అలాగే, ఒత్తిడిని తగ్గిస్తుంది. వెన్నెముక, భుజాల కండరాలు బలంగా తయారవుతాయి.
రక్తపోటును నివారించడంలో సైక్లింగ్ పాత్ర ఎంతో ఉంటుంది. వారంలో నాలుగు రోజులపాటు నిత్యం 40 నిమిషాలు సైక్లింగ్ చేయడం అలవర్చుకోవాలి. దీంతో 10 పాయింట్ల బీపీ తగ్గుతుంది. అలాగే, రోప్ జంపింగ్ కూడా చేయాలి. నిత్యం 30 నిమిషాల పాటు రోప్ జంపింగ్తో 8-10 పాయింట్లు బీపీ తగ్గించుకోవచ్చు. నడకతో కూడా బీపీని అదుపులో పెట్టుకోవచ్చు. వారంలో ఐదు రోజులపాటు నిత్యం 30-40 నిమిషాలు వాకింగ్ చేయడం రక్తపోటును నివారిస్తుంది.
రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు నిత్యం కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా బీట్రూట్, పైనాపిల్, లిక్కరైస్ టీ, క్యారట్ తీసుకోవడం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది. నిత్యం 250 గ్రాముల బీట్రూట్ తినడం వల్ల ధమనులు మరమ్మతై రక్తం సాఫీగా సరఫరా అయ్యేట్లు సహకరిస్తుంది. అలాగే, పైనాపిల్ జ్యూస్ నిత్యం 240 ఎంఎల్ తీసుకుంటే శరీరానికి పొటాషియం అంది అధిక రక్తపోటును నివారిస్తుంది. ఇక లిక్కరైస్ టీ తీసుకోవడం వల్ల కార్టిసాల్ను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్ను నియంత్రిస్తుంది. దీంతో పాటు ఆడ్రినలిన్ పనిచేసే విధానాన్ని సమతుల్యం చేస్తుంది. చివరగా క్యారట్.. ఇది కూడా బీపీని నియంత్రించడంలో గొప్పగా పనిచేస్తుంది. నిత్యం క్యారట్ రసం తాగడం వల్ల గుండె, మూత్రపిండాలకు రక్త ప్రవాహం మెరుగయ్యేట్లు చేసి బీపీని కంట్రోల్ చేస్తుంది.
పాకిస్తాన్లో రెపరెపలాడిన తాలిబాన్ జెండాలు.. చిక్కుల్లో ఇమ్రాన్ఖాన్
వివాదాల సుడిగుండంలో పంజాబ్ కొత్త సీఎం
ఢిల్లీలో పాగా వేసిన ఈస్ట్ఇండియా కంపెనీ
మహిళ చేతిలో పోలీసు నిలువుదోపిడి.. ఎలాగంటే..?
ఆఫ్ఘనిస్తాన్లో ఆకలి కేకలు.. తిండి కోసం ఇంట్లో సామాన్లు అమ్ముకుంటున్న ప్రజలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..