మన దేశంలోకి వర్తకం కోసం వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ (East India Company) .. మెల్లమెల్లగా మన దేశంపై పట్టుపెంచుకున్నది. అప్పటి రాజులు, సామంతులతో కుయుక్తులు పన్ని, మన దేశాన్ని ఆక్రమించుకున్నది. 1857 లో సరిగ్గా ఇదే రోజున ఇప్పటి మన దేశ రాజధాని నగరం అయిన ఢిల్లీని ఆక్రమించుకున్నది. దాంతో సిపాయిల తిరుగుబాటు బలహీనపడిపోయింది.
1857 ప్రారంభ రోజుల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ తన సైనికులకు కొత్త ఎన్ఫీల్డ్ రైఫిల్స్ అందజేసింది. ఈ రైఫిల్స్లో కాట్రిడ్జ్లను లోడ్ చేయడానికి ముందు దానిని నోటితో తెరవాల్సి ఉంటుంది. అయితే, ఈ కాట్రిడ్జ్లను ఆవు, పంది కొవ్వుతో తయారు చేశారనే వార్త దావానలంలా వ్యాపింపజేశారు. దాంతో సైనికులు ఈ కాట్రిడ్జ్లను ఉపయోగించడానికి నిరాకరించారు. ఈ నిరసనలో ముందున్న మంగళ్ పాండేను బ్రిటీష్ సైనికులు ఉరితీశారు. 1857లో సిపాయిల తిరుగుబాటు జరుగడానికి ఇది మొదటి కారణం. ఈ ఉద్యమం మీరట్ జైలు నుంచి దేశవ్యాప్తంగా వ్యాపించింది. బ్రిటిష్ వారిని తరిమికొట్టడం ద్వారా మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్కు పాలనాపగ్గాలు అప్పగించాలనుకున్నారు. మే నెల 10 వ తేదీ రాత్రి గుర్రంపై మీరట్ నుంచి సైనికుల బృందం ఉదయాన్నే ఢిల్లీ చేరుకున్నది. బహదూర్ షా జాఫర్ను తమ నాయకుడిగా ప్రకటించారు.
ఈస్ట్ ఇండియా కంపెనీ ఢిల్లీని స్వాధీనం చేసుకున్న వార్త దేశవ్యాప్తంగా వ్యాపించడంతో తిరుగుబాటు స్వరం మరింతగా పెరుగడం ప్రారంభమైంది. కంపెనీ పాలన ముగిసిపోతుందని భారతీయులు భావించడం ప్రారంభించారు. కానీ, కంపెనీ ప్రతీకారం తీర్చుకున్నది. మందుగుండు సామగ్రి ఇంగ్లండ్ నుంచి దిగుమతి చేసుకుని కంపెనీ బలగాలు ఢిల్లీని ముట్టడించాయి. దీంతో కంపెనీ విజయం సులువైంది. సెప్టెంబర్ 20 న బ్రిటిష్ దళాలు ఢిల్లీని తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. ఈ సమయంలోనే చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ కండ్ల ముందే అతడి ముగ్గురు కుమారులను బ్రిటీష్ సైనికులు కాల్చి చంపారు.
2011: అమెరికాలో ముగిసిన ‘అడగవద్దు, చెప్పవద్దు’ విధానం
2010: మధ్యప్రదేశ్లోని శివపురిలో జరిగిన రైలు ప్రమాదంలో 21 మంది దుర్మరణం
2009: ఆస్కార్ అవార్డుల విదేశీ చలనచిత్ర విభాగంలో భారతదేశం ఎంట్రీగా ఎంపికైన మరాఠీ చిత్రం ‘హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ’
2008: ఇస్లామాబాద్ మారియట్ హోటల్ వద్ద కారు బాంబుదాడిలో చెక్ అంబాసిడర్, ముగ్గురు అమెరికన్లతో పాటు 54 మంది దుర్మరణం
2004: మొట్టమొదటి విద్యా ఉపగ్రహం ఎడ్యుశాట్ను ప్రయోగించిన ఇస్రో
2001: 9/11 ఉగ్రవాద దాడుల తర్వాత ఉగ్రవాదంపై యుద్ధం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ష్
1996: కరాచీలో పోలీసులతో జరిగిన ఘర్షణలో బెనజీర్ భుట్టో సోదరుడు ముర్తజా భుట్టోతోపాటు ఆరుగురు అనుచరులు మరణం
1984: లెబనాన్ రాజధాని బీరుట్లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఆత్మాహుతి దాడి
1965: భారతదేశం-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించిన యూఎన్ భద్రతా మండలి
1946: మొదటి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్రెంచ్ రివేరాలోని రిసార్ట్ నగరంలో ప్రారంభం
1946: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ జననం
మహిళ చేతిలో పోలీసు నిలువుదోపిడి.. ఎలాగంటే..?
ఆఫ్ఘనిస్తాన్లో ఆకలి కేకలు.. తిండి కోసం ఇంట్లో సామాన్లు అమ్ముకుంటున్న ప్రజలు
119 అశ్లీల చిత్రాలను నిర్మించి.. 9 కోట్లకు అమ్మాలనుకున్నాడు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..