ముంబై : వ్యాపారవేత్త రాజ్ కుంద్రా (Raj Kundra Case) తన యాప్ వినియోగదారులను 3 రెట్లు పెంచుకోవాలని, రెండేండ్లలో 8 రెట్ల లాభం పొందాలని ప్లాన్ చేశాడు. అతడు 119 అశ్లీల చిత్రాలను నిర్మించి, రూ.8.84 కోట్లకు విక్రయించాలని అనుకున్నాడు. అతడి యాప్ ఒకటి నిషేధానికి గురవడంతో.. అతడు మరో యాప్ను రూపొందించాడు. డిజిటల్ మీడియాను ఉపయోగించుకుని అక్రమంగా డబ్బు సంపాదించడానికి రాజ్ చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. అశ్లీల చిత్రాల విషయం బయట పడటంతో డాటాను తొలగించడం ద్వారా తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించాడు. ఈ విషయాలను ముంబై పోలీసులు తమ అనుబంధ చార్జిషీట్లో పొందుపరిచారు.
మడ్ ఐల్యాండ్లోని ఓ భవంతిపై పోలీసులు దాడులు జరిపిన సందర్భంలో అశ్లీల చిత్రాల నిర్మాణం విషయాలు బయటకు వచ్చాయి. రాజ్ కుంద్రా సంస్థలో పనిచేస్తున్న ఉమేష్ కామత్ అనే వ్యక్తి ఇక్కడ అశ్లీల చిత్రాలను నిర్మించి, వాటిని లండన్లోని రాజ్ కుంద్రా బామ్మర్ది ప్రదీప్ బక్షికి పంపేవాడు. అక్కడ ఉమేశ్ కామత్ అశ్లీల చిత్రాలను యాప్లో అప్లోడ్ చేసేవాడు. ఛార్జ్షీట్ ప్రకారం, ‘హాట్షాట్’ యాప్ ఖాతా, ‘హాట్షాట్’ టేక్ డౌన్ అనే రెండు వాట్సాప్ గ్రూపులు ఉమేష్ మొబైల్లో గుర్తించారు. ఈ రెండు గ్రూపులకు అడ్మిన్ కూడా ఉమేశ్ కామతే. పూర్తి విచారణ అనంతరం మొత్తం రాకెట్కు సూత్రధారి రాజ్ కుంద్రా అని పోలీసులు తేల్చారు.
ప్రదీప్ బక్షి ద్వారా పోర్న్ వీడియోలను అప్లోడ్ చేసి, దానికి బదులుగా డబ్బు సంపాదించేవాడని పోలీసులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఈ పనులన్నీ చట్టవిరుద్ధమని రాజ్ కుంద్రాకు తెలిసినందునే పోలీసులకు చిక్కుకోకుండా ఉండేందుకు చాలా డాటాను తొలగించడానికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. అశ్లీల కంటెంట్ ఉన్నందుకు గూగుల్ ప్లే, యాపిల్ స్టోర్ ‘హాట్షాట్’ యాప్ని నిషేధించాయి. దాంతో ఆయన మరో యాప్ ‘బోలీ ఫేం’ ను తీసుకొచ్చాడని ఛార్జ్షీట్లో వెల్లడించారు.
ముగిసిన కోవింద్ సిమ్లా పర్యటన
సింధు జల ఒప్పందానికి 61 ఏండ్లు
ప్రధానికి మహిళా క్రీడాకారులు ఇచ్చిన బహుమతులు వేలానికి..
కండ్లు మసకబారుతున్నాయా? అయితే ఈ వ్యాధి కావచ్చు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..