సిమ్లా : రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ (Ramnath Kovind) హిమాచల్ప్రదేశ్ పర్యటన ముగిసింది. ఉదయం 11 గంటలకు అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరారు. హిమాచల్ ప్రదేశ్లోని ప్రముఖ జఖు ఆలయంలో కోవింద్ దంపతులు ప్రత్యేక పూజలు జరిపారు. రిడ్జ్ మైదాన్ వద్ద భార్య, కుమార్తె, ఇతర కుటుంబసభ్యులతో కలిసి నడిచారు. సిమ్లావాసులతో మాట్లాడారు. పలువురు స్థానికులు రాష్ట్రపతితో సెల్ఫీలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, స్పీకర్ విపిన్ సింగ్ పర్మార్, ఆర్మీ అధికారులు రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికారు. మరో రెండు రోజులు సిమ్లాలో ఉండాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి వాతావరణం మారుతున్నందున వైద్యుల సూచన మేరకు షెడ్యూల్ను కుదించారు.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈనెల 16 న సిమ్లా చేరుకున్నారు. ఆయన వెంట భార్య, కుమార్తెతోపాటు కుటుంబసభ్యులు సిమ్లా పర్యటనకు వచ్చారు. హిమాచల్ప్రదేశ్ విధాన సభ ప్రత్యేక సెషన్లో పాల్గొని ప్రసంగించారు. అలాగే పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ప్రముఖ జఖు దేవాలయంలో హనుమంతుడిని సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. వీరి వెంట ముఖ్యమంత్రి భార్య డాక్టర్ సాధనా ఠాకూర్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సురేశ్ భరద్వాజ్, ప్రధాన కార్యదర్శి రామ్ సుభాగ్ సింగ్, ఇతర అధికారులు ఉన్నారు.
సింధు జల ఒప్పందానికి 61 ఏండ్లు
ఎన్నికల బరిలో 49 మంది భారత సంతతి వ్యక్తులు
ప్రధానికి మహిళా క్రీడాకారులు ఇచ్చిన బహుమతులు వేలానికి..
కండ్లు మసకబారుతున్నాయా? అయితే ఈ వ్యాధి కావచ్చు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..