భారతదేశం-పాకిస్తాన్ మధ్య సింధు జల ఒప్పందంపై (Indus Water Treaty) సంతకాలు చేసి ఇవాల్టికి 61 ఏండ్లు పూర్తయ్యాయి. 1960 లో జరిగిన ఈ ఒప్పందంపై రెండు దేశాల ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, అయూబ్ఖాన్ సంతకాలు చేశారు. రెండు దేశాల మధ్య 6 నదులకు సంబంధించిన నీటి పంపకాల వివాదాలకు పరిష్కారంగా ఈ ఒప్పందం జరిగింది. రెండు దేశాల మధ్య ఇప్పటికీ అనేక వివాదాలు ఉన్నప్పటికీ.. ఈ ఒప్పందంపై ఎలాంటి ప్రభావం లేకపోవడం విశేషం.
సింధు నది విస్తీర్ణం దాదాపు 11.2 లక్షల కి.మీ. ఈ ప్రాంతం పాకిస్తాన్ (47 శాతం), భారతదేశం (39 శాతం), చైనా (8 శాతం), ఆఫ్ఘనిస్తాన్ (6 శాతం) లో ఉన్నది. సింధు నది పరిసర ప్రాంతాల్లో దాదాపు 30 కోట్ల మంది నివసిస్తున్నారు. విభజన సమయంలో సింధు నది లోయ, దాని కాలువలను కూడా విభజించారు. అయితే పాకిస్తాన్ దాని నీటి వాటా కోసం పూర్తిగా భారత్పై ఆధారపడి ఉన్నది.
పాకిస్తాన్కు నీటి సరఫరా కోసం 1948 మార్చి 31 నాటికి పాకిస్తాన్కు కొంత వాటా ఇవ్వాలని నిర్ణయించారు. 1948 ఏప్రిల్ 1 న, భారతదేశం కాలువల నీటిని నిలిపివేసింది. దాంతో పాకిస్తాన్లో పరిస్థితి మరింత దిగజారింది. రెండు దేశాల మధ్య పలు దఫాలుగా సమావేశాలు జరిగాయి. చివరకు సింధు జలాల ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.
ఈ ఒప్పందం ప్రకారం, సింధు నది లోయలోని నదులను తూర్పు, పశ్చిమ నదులుగా విభజించారు. తూర్పు ప్రాంతంలోని మూడు నదులు – రవి, బియాస్, సట్లెజ్.. భారతదేశానికి.. సింధు, చీనాబ్, జీలం నదులను పాకిస్తాన్కు ఇచ్చారు. పాకిస్తాన్లోని నదుల నీటిని విద్యుత్, నీటిపారుదలకు పరిమితంగా ఉపయోగించుకునే హక్కు కూడా భారతదేశానికి ఉన్నది. ఐదేండ్ల క్రితం యురిలో భారతీయ సైనికులను ఉగ్రవాదులు బాంబులతో హతమార్చిన సమయంలో ఈ ఒప్పందాన్ని భారతదేశం రద్దు చేయాలనే డిమాండ్ వచ్చింది.
2018 : అమలులోకి ట్రిపుల్ తలాక్ చట్టం
2008 : ఢిల్లీ బాట్లా హౌస్ ఎన్కౌంటర్
2007 : డర్బన్లో ఇంగ్లండ్తో జరిగిన టీ20 మ్యాచ్లో ఓవర్లో 6 సిక్సర్లు బాది 12 బంతుల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసి రికార్డు సాధించిన యువరాజ్ సింగ్
2006 : థాయిలాండ్లో సైనిక తిరుగుబాటు, ప్రధానిగా సురాయుద్ ఎన్నిక
1982 : ఆన్లైన్ సందేశాన్ని ఉపయోగించిన మొదటివ్యక్తిగా నిలిచిన స్కాట్ ఫహ్మాన్
1965 : అంతరిక్ష ప్రయాణం చేపట్టిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ జననం
1957 : నెవాడా ఎడారిలో మొదటి భూగర్భ అణు పరీక్ష చేపట్టిన అమెరికా
1907 : సింథటిక్ ఆయిల్ను కనుగొన్న స్కాటిష్ శాస్త్రవేత్త జేమ్స్ యాంగ్
1888 : బెల్జియంలో మొట్టమొదటి అందాల పోటీలు ప్రారంభం
ఎన్నికల బరిలో 49 మంది భారత సంతతి వ్యక్తులు
ప్రధానికి మహిళా క్రీడాకారులు ఇచ్చిన బహుమతులు వేలానికి..
కండ్లు మసకబారుతున్నాయా? అయితే ఈ వ్యాధి కావచ్చు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..