న్యూఢిల్లీ : మహిళా క్రీడాకారులు ఇచ్చిన పలు బహుమతులను కేంద్రం ఈ-వేలం (e-auction) పెట్టింది. టోక్యో ఒలింపిక్స్, పారాలింప్స్లో పాల్గొన్న భారతదేశం క్రీడాకారులు ఇటీవల ప్రధాని మోదీని కలుసుకుని పలు బహుమతులను అందజేశారు. ఈ బహుమతుల్లో నుంచి ముఖ్యంగా మహిళా క్రీడాకారులు లవ్లీనా బోర్గోహైన్ అందించిన బాక్సింగ్ గ్లోవ్స్. పీవీ సింధూ ఇచ్చిన బ్యాడ్మింటన్ రాకెట్తో కూడిన కిట్, వుమెన్ హాకీ టీం స్టిక్, భవానీ దేవి ఫెన్సింగ్ తల్వార్, భవీనా పటేల్ అందించిన టీటీ బ్యాట్, రెడ్ కలర్ టీ షర్ట్, అవని లఖేడా ధరించిన వైట్ కలర్ టీషర్ట్ ఉన్నాయి.
నెల రోజుల పాటు కొనసాగే ఈ-వేలంలో, మహిళా పతక విజేతల బహుమతులు కనిపిస్తాయి. ఇప్పటివరకు రూ.13 కోట్లకు పైగా విలువ చేసే మొత్తం బిడ్లు నమోదయ్యాయి. ఇటీవల ప్రధానమంత్రి నివాసంలో జరిగిన సమావేశంలో ఈ-వేలం గురించి ఆటగాళ్లతో మోదీ చర్చించారు. టోక్యో ఒలింపిక్స్లో 64-69 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించిన లవ్లినా బోర్గోహైన్ ధరించిన గ్లోవ్స్ ప్రాథమిక ధర రూ.80 లక్షలుగా నిర్ణయించగా.. ఇప్పటివరకు రూ.10 కోట్ల బిడ్లు దాటినట్లు తెలుస్తున్నది. మూడో స్థానం కోసం దిగిన బరిలో ప్రత్యర్థిని ఓడించిన గ్లోవ్స్పై సంతకం చేసి మోదీకి లవ్లీనా అందించింది.
ప్రధాని మోదీకి మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అందించిన రాకెట్, బ్యాడ్మింటన్ కిట్ బ్యాగ్ ప్రాథమిక ధరను వేలంలో రూ.80 లక్షలుగా ఉంచారు. వేలం ప్రారంభం కాగానే రూ.2.20 కోట్లు దాటింది. టోక్యో ఒలింపిక్స్లో చైనాకు చెందిన బింగ్ జియావోను ఓడించి సింధూ కాంస్యం గెలుచుకున్నది. 2016 రియో ఒలింపిక్స్లో కూడా రజత పతకం సాధించింది. వేలంలో ఉంచిన రాకెట్పై పీవీ సింధూ సంతకం కూడా ఉన్నది.
టోక్యో ఒలింపిక్స్లో భారత మహిళల హాకీ జట్టు ఉపయోగించిన స్టిక్ కూడా వేలంలో పెట్టారు. ప్రాథమిక ధర రూ.80 లక్షలతో ఉంచగా.. బిడ్ రూ. కోటి దాటిపోయింది. హాకీ స్టిక్పై రక్షక్ అని తెలుపు రంగులో వ్రాసి ఉంచారు. ఈ బ్యాటును జట్టు కెప్టెన్గా వ్యవహరించిన రాణి రాంపాల్ వాడింది. రాణి రాంపాల్ నాయకత్వంలోని భారత హాకీ జట్టు పోరాడి ఓడి చివరకు నాలుగో స్థానాన్ని నిలబెట్టుకోగలిగింది. స్టిక్పై జట్టు సభ్యులందరూ సంతకాలు చేశారు.
భారత్ తరపున తొలిసారి ఒలింపిక్స్ ఫెన్సింగ్లో పాల్గొని చక్కని ప్రతిభ కనబర్చిన భవానీ దేవి తన తల్వార్ను ప్రధాని మోదీకి బహూకరించింది. ఈ తల్వార్కు ప్రాథమిక ధరను రూ.60 లక్షలుగా నిర్ణయించారు. ఫెన్సింగ్ క్రీడలో ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారతీయురాలు భవానీదేవి. ఎరుపు రంగులో ఉన్న కత్తి హ్యాండిల్పై భవానీ దేవి సంతకం చేసింది.
టోక్యో పారాలింపిక్స్లో రజత పతకం సాధించిన భవీనా పటేల్ వాడిన టేబుల్ టెన్నిస్ బ్యాట్ను రూ. 25 లక్షలకు బిడ్ చేశారు. రాకెట్పై ఆమె సంతకం ఉంది. టోక్యో పారాలింపిక్స్లో భవీనా పటేల్ భారతదేశానికి మొదటి పతకం సాధించింది. ఈ నలుపు రంగు రాకెట్ను భవీనా స్వయంగా ప్రధానికి అందజేశారు. ఆమె ధరించిన రెడ్ కలర్ టీషర్ట్ను కూడా ఈ-వేలానికి పెట్టారు. దీని ప్రారంభ బిడ్గా రూ.15 లక్షలుగా ఉంచారు. ఇదే టీషర్ట్ ధరించి భవీనా పటేల్ పతకం సాధించింది.
టోక్యో పారాలింపిక్స్ షూటింగ్ విభాగంలో పాల్గొని ఒక బంగారు, ఒక వెండి పతకంతో మెరిసిన అవ్నీ లఖేరా.. ఇటీవల ప్రధాని మోదీని కలిసినప్పుడు తాను ధరించిన తెలుపు రంగు టీషర్ట్ను బహుమతిగా అందించింది. ఈ టీషర్ట్ను ఈ-వేలంలో పెట్టి ప్రారంభ బిడ్గా రూ.15 లక్షలుగా నిర్ణయించారు. ఈ టీషర్ట్పై అవ్నీ లఖేరా సంతకం చేశారు.
కండ్లు మసకబారుతున్నాయా? అయితే ఈ వ్యాధి కావచ్చు..!
మోదీకి ప్రత్యామ్నాయం మమతయే.. రాహుల్ కాదు
ఆ దాడి నిజంగా తప్పిదమే.. క్షమాపణలు చెప్పిన యూఎస్ ఆర్మీ
మళ్లీ ఏకమవుతున్న బీజేపీ-శివసేన!
మర్చిపోలేని ఉరి ఘటనకు ఐదేండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..