జమ్ముకశ్మీర్ యురి (Uri Attack) లోని ఆర్మీ ప్రధాన కార్యాలయంపై నలుగురు ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో భారతదేశానికి చెందిన దాదాపు 10 మంది సైనికులు వీరమరణం పొందారు. దీనికి ప్రతీకారంగా భారత సైన్యం 10 రోజుల తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేపట్టి పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను బూడిద చేసింది. ఈ ఘటన జరిగి ఇవ్వాల్టికి సరిగ్గా ఐదేండ్లు పూర్తయ్యాయి.
జమ్ముకశ్మీర్లోని ఉరిలో భారత సైన్యం బ్రిగేడ్ ప్రధాన కార్యాలయం వద్ద ఉదయం 5:30 గంటలకు నలుగురు ఉగ్రవాదులు నియంత్రణ రేఖను దాటి వచ్చి దాడికి పాల్పడ్డారు. కేవలం 3 నిమిషాల వ్యవధిలోనే ఉగ్రవాదులు 15 కు పైగా గ్రనేడ్లను శిబిరంపైకి విసిరారు. ఈ దాడిలో భారత ఆర్మీకి చెందిన 19 మంది సైనికులు వీరమరణం పొందారు. చాలామంది గాయాలపాలయ్యారు. గత 20 ఏండ్లలో సైన్యంపై జరిగిన అతిపెద్ద దాడి ఇది. ఈ దాడిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది.
దీనికి ప్రతీకారం తీర్చుకునేందుకు సమయం కోసం వేచివున్న భారత సైనికులు.. పాక్ సరిహద్దుల్లోని ఉగ్ర శిబిరాలపై సెప్టెంబర్ 28-29 రాత్రి సర్జికల్ స్ట్రైక్ చేపట్టారు. మూకుమ్మడిగా వైమానిక దాడి చేసి అనేక శిక్షణా శిబిరాలను బూడిద చేశారు. భీంబర్, కెల్, తట్టపాణి, లిపా ప్రాంతాల్లోని అనేక ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లను నేలమట్టం చేశారు. మొత్తం దాడి ప్రణాళికతో చేపట్టారు. దీని గురించి పాకిస్తాన్ సైన్యానికి వీసమెత్తు కూడా తెలియదు. రా, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఈ మిషన్లో ఉగ్రవాదుల ప్రతి కదలికను జాగ్రత్తగా పర్యవేక్షించాయి. ఉదయాన్నే ఆపరేషన్ పూర్తి చేసిన తర్వాత భారత సైన్యం తిరిగి వచ్చింది. ఈ దాడిలో 38 మంది ఉగ్రవాదులు మరణించినట్లు భారత సైన్యం ప్రకటించింది.
2019: భారత ప్రభుత్వం ఈ-సిగరెట్ల ఉత్పత్తి, దిగుమతి, ఎగుమతి, రవాణా, అమ్మకం, నిల్వలపై నిషేధం విధింపు
2006: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరిన రష్యన్ రాకెట్ సోయుజ్
2003: ఢాకా-అగర్తలా బస్సు సర్వీస్ ప్రారంభం
2002: పోర్చుగల్లో గ్యాంగ్ స్టర్ అబూ సలేం అరెస్టు
1997: ఓజోన్ పొరను రక్షించడానికి 100 దేశాలు 2015 నాటికి మిథైల్ బ్రోమైడ్ ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయం
1988: రాజ్యాంగాన్ని రద్దు చేసిన బర్మా
1967: ఇంగ్లిష్ను అధికారిక భాషగా స్వీకరించిన నాగాలాండ్
1922: లీగ్ ఆఫ్ నేషన్స్లో చేరిన హంగేరీ
1851 : న్యూయార్క్ టైమ్స్ ప్రారంభం
1803: ఒడిశాలో పూరీని స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ సైన్యం
డబ్బానిండా 5 సెంట్ల కాయిన్లు.. ఎందుకిచ్చాడంటే?
14 ఏండ్ల క్రితం కిడ్నాప్.. ఫేస్బుక్ మెసేజ్తో కలిసిన తల్లీకూతురు
దగ్గితే చాలు.. వ్యాధేంటో ఈ యాప్ చెప్తుంది!
మనుషుల మాదిరిగా టాయిలెట్ వాడుతున్న ఆవులు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..