(5 Cent Coins) ఉద్యోగి-సంస్థ మధ్య అనుబంధానికి సంబంధించిన ఎన్నో కథలు విన్నాం. అయితే, డబ్లిన్లో జరిగిన సంఘటన విరుద్ధంగా ఉన్నది. ఉద్యోగి బాగా పనిచేస్తే.. ఆయన కోరింది యాజమాన్యం ఇస్తుంది. బాగా చూసుకుంటుంది. అదే ఉద్యోగి ఉన్నపళంగా సంస్థ నుంచి వెళ్లిపోతున్నానంటే.. ఎక్కడా లేని కోపాన్ని తెచ్చుకుని ప్రతాపం చూపిస్తుంది. ఇది అన్ని చోట్లా జరిగే తంతే. అచ్చం ఇలాంటి సంఘటనే ఒకటి డబ్లిన్లో జరిగింది.
డబ్లిన్లోని సౌత్ విలియం స్ట్రీట్లోని ఆల్పీస్ రెస్టారెంట్లో రియాన్ కియోగ్ అనే ఉద్యోగి పనిచేస్తున్నాడు. కొంతకాలం బాగా పనిచేసిన కియోగ్.. ఆ సంస్థ నుంచి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని రెస్టారెంట్ యజమానికి చెప్పాడు. అయితే, ఫైనల్ సెటిల్మెంట్ కోసం కియోగ్ కొన్నిరోజుల పాటు వేచిఉండాల్సి వచ్చింది. చివరకు జీతం ఇవ్వాల్సిందే అని ఒత్తిడి తేగా, వెంటనే లోనికెళ్లిన యజమాని.. ఓ డబ్బా నిండా 5 సెంట్ల నాణేలను అందజేశాడు. ఈ విషయాన్ని కియోగ్ తన ట్విట్టర్ ప్రొఫైల్లో 5 సెంట్ల నాణేలతో నింపిన మయోన్నైస్ బకెట్ చిత్రాన్ని షేర్ చేశాడు. పాత యజమానితో చేసిన చాటింగ్ స్క్రీన్షాట్లను కూడా షేర్ చేశాడు. ఈ విషయంపై రెస్టారెంట్ యజమానిని వివరణ కోరగా, ఏదైతేనేం కియోగ్కు జీతం డబ్బు ముట్టింది కదా అని ముక్తసరి జవాబిచ్చాడు. బ్యాంకు నుంచి క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తానంటే వద్దని, నగదే కావాలనడంతో అలా ఇచ్చానని చెప్పాడు.
ఈ మొత్తం సెంట్లను తూకం వేయడంతో 29.8 కిలోలుగా తూగింది. దీని ఫొటోను కూడా కియోగ్ షేర్ చేయగా.. నెటిజెన్లు తీవ్రంగా స్పందించారు. ఇది యజమాని షాకింగ్ బిహేవియర్కు అద్దం పడుతుందని ఒకరంటే.. ఇలాంటి వారి వల్ల మంచి రెస్టారెంట్లకు కూడా చెడ్డ పేరు వస్తుందని మరోకరు కామెంట్లు పోస్ట్ చేశారు.
14 ఏండ్ల క్రితం కిడ్నాప్.. ఫేస్బుక్ మెసేజ్తో కలిసిన తల్లీకూతురు
2024 నాటికి అందుబాటులోకి ఫ్లయింగ్ కార్లు
చార్ధామ్ యాత్రపై నిషేధం ఎత్తివేత
దగ్గితే చాలు.. వ్యాధేంటో ఈ యాప్ చెప్తుంది!
మనుషుల మాదిరిగా టాయిలెట్ వాడుతున్న ఆవులు
సిమ్లా పర్యటనలో రాష్ట్రపతి కోవింద్
ప్రపంచంలో తొలి ఫొటోకాపీయింగ్ ఎప్పుడో తెలుసా?
డెలివరీ బాయ్ అవతారమెత్తిన అమితాబ్ బచ్చన్.. ఎందుకంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..