డెహ్రాడూన్ : చార్ధామ్ యాత్రపై (Chardham Yatra) నిషేధాన్ని ఉత్తరాఖండ్ హైకోర్టు గురువారం ఎత్తివేసింది. దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యపై రోజువారీ పరిమితి చేయాలని సూచించింది. కొవిడ్-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ధామ్లను సందర్శించే భక్తులకు కరోనావైరస్ పాజిటివ్ రిపోర్టులు, రెండో డోసుల టీకా తీసుకున్న సర్టిఫికేట్ను తప్పనిసరి చేయాలని కోర్టు ఆదేశించింది. కొవిడ్ మార్గదర్శకాలను పాటించేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని తెలిపింది.
చార్ధామ్ను సందర్శించేందుకు హై కోర్టు యాత్రికులను అనుమతించినప్పటికీ, ఆలయాలను సందర్శించే భక్తుల సంఖ్యపై రోజువారీగా పరిమితి విధించాలన్నది. కేదార్నాథ్ ఆలయంలో 800 మంది భక్తులు, బద్రీనాథ్ ఆలయంలో 1200 మంది, గంగోత్రిలో 600 మంది, యమునోత్రి ధామ్లో 400 మంది భక్తులను మాత్రమే అనుమతించాని హైకోర్టు తెలిపింది.గతంలో కొవిడ్ థర్డ్వేవ్ ముప్పును దృష్టిలో పెట్టుకుని చార్ధామ్ యాత్రకు అనుమతించేందుకు హైకోర్టు నిరాకరించింది.
కొవిడ్ పరిస్థితిలు మెరుగుపడినందున భక్తులు వచ్చేందుకు యాత్రకు అనుమతించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేసింది. యాత్రకు వచ్చే పర్యాటకులపై ఆధారపడి ఎందరో జీవిస్తున్నారని, దీనిని విచారణించిన హైకోర్టు ఈ ఉత్తర్వును జారీ చేసింది. ఇలాఉండగా, తాజా అధికారిక డాటా ప్రకారం.. ఉత్తరాఖండ్లో ప్రస్తుతం 296 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొవిడ్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 7,389 మంది చనిపోయారు.
దగ్గితే చాలు.. వ్యాధేంటో ఈ యాప్ చెప్తుంది!
మనుషుల మాదిరిగా టాయిలెట్ వాడుతున్న ఆవులు
సిమ్లా పర్యటనలో రాష్ట్రపతి కోవింద్
ప్రపంచంలో తొలి ఫొటోకాపీయింగ్ ఎప్పుడో తెలుసా?
డెలివరీ బాయ్ అవతారమెత్తిన అమితాబ్ బచ్చన్.. ఎందుకంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..