హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : పర్యావరణ పరిరక్షణ కోసం తపిస్తున్న గ్రీన్ ఇండియా చాలెంజ్, వచ్చే ఐదేండ్ల్లలో 100 కోట్ల మొకలు నాటే బృహత్తర సంకల్పంతో 9వ విడత కార్యాచరణను ప్రారంభించింది. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు 50వ పుట్టినరోజు సందర్భంగా గోదావరి తీరంలో 99 లక్షల మొకలు నాటే హరితయజ్ఞం శుక్రవారం మొదలైంది. మహారాష్ట్ర, నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలోని బాబ్లీ వద్ద గోదావరి తీరంలో వెయ్యి వెదురు మొకలు నాటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రీన్ ఇండియా చాలెంజ్(జీఐసీ) సృష్టికర్త, మాజీ ఎంపీ సంతోష్కుమార్, ఇగ్నైటింగ్ మైండ్స్ సంస్థ ఫౌండర్ కరుణాకర్రెడ్డి, జీఐసీ కో ఫౌండర్ రాఘవేంద్రయాదవ్, యూత్ ఫర్ గోదావరి బృందం, బాబ్లీ, పొరుగు గ్రామాల సర్పంచ్లు వెదురు మొక్కలు నాటారు.
బాసర నుంచి త్రయంబకేశ్వర్ వరకు గోదావరి నదికి రెండు వైపులా నది కోతకు గురికాకుండా ఉండేందుకు 99 లక్షల వెదురు మొకలు నాటి సంరక్షించనున్నారు. ఇందుకోసం మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని విద్యార్థులు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, యువజన సంఘాలకు చెందిన 50 లక్షల మంది వలంటీర్లు పనిచేస్తున్నారు. దకన్ ప్రాంతంలో వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకోగల స్థానిక వెదురు రకాలకు ఈ విడతలో ప్రాధాన్యమిచ్చారు. ఈ హరితహారం మంజీరా, ప్రాణహిత నదుల పరీవాహక ప్రాంతాల్లో కూడా కొనసాగనున్నది. ఈ వెదురు చెట్లు.. ప్రకృతి సిద్ధమైన రిటైనింగ్ వాల్లా రక్షణ ఇవ్వనున్నాయి.

బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ పుట్టిన రోజును గ్రీన్ ఇండియా చాలెంజ్ వినూత్నంగా నిర్వహిస్తున్నది. కేటీఆర్ జీవితంలో పూర్తయిన ఒకో ఏడాదికి రెండు లక్షల మొకల చొప్పున 99 లక్షల మొకలు నాటుతున్నది. వచ్చే ఏడాది వరకు ఈ ప్లాంటేషన్ డ్రైవ్ కొనసాగనున్నది.
ఈ సందర్భంగా జీసీఐ వ్యవస్థాపకుడు సంతోష్కుమార్ మాట్లాడుతూ.. ‘నది అంటే కేవలం నీటి ప్రవాహం కాదు. అది మానవ సమూహానికి ప్రాణవాయువుతో సమానం. ధరిత్రిపై సకల పంటలు పండేందుకు ఆయువు. కేటీఆర్ 50వ పుట్టినరోజు సందర్భంగా, జీవితకాలాన్ని మించి నిలిచే ఒక విశిష్ట హరిత బహుమతిని ఇవ్వాలనుకున్నాం. అందులో భాగమే ఈ గోదావరి తీరం వెంట 99 లక్షల మొకలతో హరితహారం చేపట్టాం. నది బాగుంటే.. మనమంతా బాగుంటాం. అందుకే నది రక్షణకు మా వంతు కృషి చేస్తున్నాం’ అని తెలిపారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మాజీ ఎంపీ, గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండర్ సంతోష్కుమార్ ‘ఎక్స్’ వేదికగా చిన్నప్పుడు కేటీఆర్తో దిగిన అరుదైన ఫొటోను షేర్ చేసి బర్త్డే విషెస్ తెలిపారు. ‘ప్రియమైన సోదరుడు కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు. ప్రజలకు సేవల చేయాలనే అంకితభావం, విజనరీ లీడర్షిప్, మీరు చూపే ప్రేమ లక్షల మందికి స్ఫూర్తిగా నిలుస్తాయి. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.