మహబూబ్ నగర్ : జిల్లాలోని అల్లిపూర్ గ్రామంలో నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ను ఆబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మిషన్ భగీరథతో తెలంగాణలో తాగు నీటి గోస తప్పిందన్నారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే ఇది సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, జడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, ఎంపీపీ సుధాశ్రీ, సర్పంచ్ అంజిలయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆగని పెట్రో వడ్డన.. లీటర్పై 35 పై
హరితహారం దేశానికే స్ఫూర్తిదాయకం