కుమ్రంభీం అసిఫాబాద్ : హరితహారం కార్యక్రమం దేశానికే స్ఫూర్తిదాయకం అని జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. వాంకిడి మండలం కోమటిగూడ గ్రామంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు తో కలిసి పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా చేస్తున్నారని ప్రశంసించారు.
నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాలన్నారు. పల్లె ప్రగతి ద్వారా పల్లెలలోని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. కార్యక్రమంలో అసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ వనజ, జెడ్పీటీసీ అజయ్, ఎంపీపీ విమల, సింగిల్ విండో చైర్మన్ పెంటు, సర్పంచ్ మంగళ, తదితరులు పాల్గొన్నారు.