అయిజ /జోగులాంబ గద్వాల : జిల్లాలోని అయిజ మున్సిపాలిటీతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో వాగులు, వంకలు ఏకమై పారాయి. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఏక ధాటిగా వాన దంచి కొట్టింది. దీంతో అయిజ మున్సిపాలిటీ తో పాటు మండలంలోని పలు గ్రామాలు జల దిగ్భంధం అయ్యాయి.
మున్సిపాలిటీలో పలు కాలనీలు నీట మునిగాయి. కొన్ని కాలనీల్లో ఇండ్లలోకి వర్షం నీరు చేరింది. ప్రజలు ఇండ్లలోకి చేరిన నీటిని బయటకు పారబోశారు.
అయిజ – చిన్న తాండ్రపాడు, అయిజ – పులికల్, అయిజ – ఉత్తనూర్ గ్రామాల సమీపంలోని పోలోని వాగు పొంగి ప్రవహించింది. వాగులు, వంకలు ప్రవహించడంతో రాక పోకలు నిలిచి పోయాయి. చిన్న తాండ్రపాడు, వేణిసొంపురం, నౌరోజీ క్యాంపు, కేశవరం, చిన్న ధన్వాడ, పెద్ద ధన్వాడ, నసనూర్ తదితర గ్రామాలకు రాక పోకలు నిలిచిపోయాయి. రోడ్డుపై ఎక్కడి వాహనాలు నిలిచి పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
ఇవి కూడా చదవండి..
ఆగని పెట్రో వడ్డన.. లీటర్పై 35 పైసలు పెంపు
హరితహారం దేశానికే స్ఫూర్తిదాయకం