ముంబై: మహారాష్ట్రలో తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో రెండువారాలపాటు పూర్తిస్థాయి లాక్డౌన్ పొడిగించే అవకాశం కనిపిస్తున్నది. లాక్డౌన్ను మరో రెండు వారాలు అమలు చేయాలని డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఇవాళ మంత్రిమండలి సమావేశం జరుగనుంది. ఈ సందర్శంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్డౌన్ పొడిగింపు అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. మహారాష్ట్రలో ప్రస్తుతం బ్రేక్ ద చైన్ పేరతో లాక్డౌన్ కొనసాగుతున్నది. అది ఈనెల 15తో ముగియనుంది.
బుధవారం జరగనున్న మంత్రిమండలి సమావేశంలో కరోనా పరిస్థితులను సమీక్షించడంతోపాటు లాక్డౌన్ను పొడిగించాలా లేదా ఎత్తివేయాలా అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోప్ అన్నారు.
లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి. సోమవారం 37,236 కేసులు నమోదవగా, నిన్న కొత్తగా 40,956 కేసులు రికార్డవగా, 793 మంది మరణించారు. దీంతో మొత్తం కేసులు 51,79,929కి చేరాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి