న్యూఢిల్లీ: కరోనా మృతుల లెక్కను మధ్యప్రదేశ్ ప్రభుత్వం దాస్తున్నది. రాష్ట్రంలో ఉన్న స్మశానవాటికలకు ప్రతిరోజు వరదలా మృతదేహాలు వస్తున్నాయి. అయినా ప్రభుత్వ లెక్కల్లో మాత్రం మృతుల సంఖ్యను స్వల్పంగా చూపిస్తున్నది. రాష్ట్రంలో నిన్న ముగ్గురు మాత్రమే మరణించారని వెల్లడించింది. అయితే ఒక్క భోపాల్లోనే 94 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడం గమనార్హం. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో శ్మశానవాటికల వద్ద భారీ సంఖ్యలో వాహనాలు బారులుతీరి ఉంటున్నాయి. మృతదేహాలను దహణం చేయడానికి మూడు నాలుగు గంటలకుపైగా వేచి ఉండాల్సి వస్తుంది. కొందరికైతే అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి స్థలం కూడా దొరకడం లేదు. అయినప్పటికీ ప్రభుత్వం రోజువారీ కరోనా మృతులను ఒకట్ల సంఖ్యలోనే చూపిస్తుండటం విశేషం.
కాగా, మరణాల సంఖ్యకు సంబంధించి రాష్ట్ర మంత్రి పటేల్ను మీడియా ప్రశ్నించగా.. కరోనా వల్ల మరణాలను ఏ ఒక్కరూ ఆపలేరు. మనుషులు వృద్ధులైన తర్వాత చనిపోవాల్సిందే కదా అని సమాధానం ఇచ్చారు. ప్రతిరోజు చాలా మంది చనిపోతున్నారని మీరంటున్నారు. ప్రజలు వృద్ధులవుతున్నారు. దీంతో వారు మరణించక తప్పదని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే 12,727 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,33,704కు చేరింది. ఇందులో 4713 మంది మరణించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..