నోయిడా: కరడుగట్టిన నేరస్థుల కోసం పోలీసులు ఓ ఇంటిపై రైడ్ చేశారు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఓ క్రిమినల్ రెండో అంతస్థులో ఉన్న బాత్రూమ్ కిటికీలో నుంచి దూకాడు. దీంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో జరిగింది.
మహమ్మద్ ఇమ్రాన్ అనే నేరస్థునికోసం గ్రేటర్ నోయిడాలోని ఒమైక్రాన్ అనే ప్రాంతంలో ఉన్న ఇంటిపై పోలీసులు దాడిచేశారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ ఇద్దరు బామ్మర్దులు లక్మాన్, చాంద్ మహమ్మద్లు పోలీసులకు పట్టుబడ్డారు. వారిని ప్రశ్నిస్తుండా చాంద్ మహమ్మద్ బాత్రూమ్ అనిచెప్పి వెళ్లాడు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఇందులో భాగంగా బాత్రూమ్ కిటికీలో నుంచి కిందికి దూకాడు. అది రెండో అంతస్థులో ఉండటంతో కిందపడిన అతనికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో పోలీసులు అతడిని దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయాడని గ్రేటర్ నోయిడా డీసీపీ రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. చాంద్పై డజనుకుపైగా దొమ్మి, హత్య కేసులు ఉన్నాయని, ఇన్స్పెక్టర్ అక్తర్ ఖాన్ హత్య కేసులో అతడు ప్రధాన నిందితుడని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..