లూథియానా: అతనో కూలీ. అనుకోకుండా కరోనా బారినపడ్డాడు. ఆర్థిక పరిస్థితి అంతంతే కావడంతో కుంగిపోయిన అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన పంజాబ్లోని లూథియానాలో చోటుచేసుకుంది. సత్పాల్ అనే 35 ఏండ్ల వ్యక్తి కరోనా లక్షణాలతో పట్టణంలోని ఓ ప్రైవేటు దవాఖానలో చేరాడు. అక్కడ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దీంతో అటునుంచి లూథియానా సివిల్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ అతనికి మంగళవారం సాయంత్రం వ్యాక్సిన్ కూడా చేశారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే తన గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతనికి రోజూ పనిచేస్తేనే పూటగడుస్తుందని, ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాని స్థానికులు తెలిపారు.
కాగా, బలవన్మరణానికి పాల్పడే ముందురోజే సత్పాల్.. సివిల్ హాస్పిటల్లో చేరాడని, మంగళవారం సాయంత్రం 5 గంటలకు అతనికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారని ఏసీపీ వార్యమ్ సింగ్ వెల్లడించారు. టీకా తీసుకున్న గంట తర్వాత అతడు హాస్పిటల్లోని తన వార్డులో ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడని, దవాఖాన సిబ్బంది గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..