Red alert : హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రంలో వరుణ బీభత్సం ఇంకా కొనసాగుతోంది. మండి జిల్లాలో భారీ వర్షాల (Heavy rains) కారణంగా మరణించిన వారి సంఖ్య 75కు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రహదారులపై కొండచరియలు విరిగిపడటం, మెరుపు వరదలు, కుంభవృష్టితో పరిస్థితి దారుణంగా మారింది. చాలాచోట్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా 240 రహదారులపై రాకపోకలు కష్టంగా మారినట్లు అధికారులు వెల్లడించారు. వీటిల్లో ఒక్క మండి జిల్లాలోనే 176 మార్గాలున్నాయి. హిమాచల్ప్రదేశ్లో ఒక్కరోజులో 115-204 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 204 మిల్లీ మీటర్లు అంటే అతి తీవ్ర వర్షపాతం కిందకు వస్తుంది. హిమాచల్ప్రదేశ్లోని కంగ్రా, సిర్మూర్, మండి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
రానున్న 24 గంటల్లో చంబా, కంగ్రా, మండి, శిమ్లా, సిర్మూర్ జిల్లాల్లో మెరుపు వరదలు రావొచ్చని ఐఎండీ హెచ్చరించింది. బిలాస్పుర్, హమీర్పూర్, చంబా, సిమ్లా, కులూ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. చాలా చోట్ల కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందన్నారు. బలహీనమైన నిర్మాణాల్లో ప్రజలను ఉండొద్దని హెచ్చరించారు. ఐటీబీపీ దళాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి.
దీనికితోడు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సాయం తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ప్రభుత్వానికి సూచించారు.