న్యూఢిల్లీ: బంగారం ధరలు మంగళవారం వరుసగా నాలుగో రోజు పడిపోయాయి. మంగళవారం మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్ జూన్ ఫ్యూచర్స్ ధర 0.09% (రూ.42) తగ్గింది. తులం బంగారం ధర రూ.47,420 వద్ద ట్రేడయింది. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బంగారం తులం బంగారం ధర రూ.47,462గా నమోదైంది. గతవారం ఎంసీఎక్స్ ట్రేడింగ్లో తులం బంగారం ధర రూ.48,400 పలికి ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది.
మరోవైపు వెండి ధర కూడా ట్రేడింగ్లో స్వల్పంగా పతనమైంది. ఎంసీఎక్స్ సిల్వర్ మే ఫ్యూచర్స్ ధర స్వల్పంగా 0.08 శాతం పతనమై రూ.68,626 వద్ద స్థిర పడింది. సోమవారం ముగింపులో రూ.68,680 వద్ద స్థిరపడింది.
ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర 0.10 శాతం పెరిగింది. ఔన్స్ బంగారం ధర 1,782 డాలర్లకు పలికింది. మరోవైపు వెండి స్పాట్ ధర ఔన్స్ కు 0.20 శాతం పెరిగి 26.25 డాలర్లకు ఎక్కువైంది. సుదీర్ఘకాలం స్పాట్ గోల్డ్ ధర 1760 డాలర్ల వద్ద తచ్చాడి.. తిరిగి 1820 డాలర్లకు చేరుతుందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఫెడ్ రిజర్వు సమావేశం మరో రెండు రోజుల్లో జరుగనుండగా అమెరికా ప్రభుత్వ బాండ్లు, డాలర్ విలువ బంగారం ధరలను ఖరారు చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఫెడ్ నిర్ణయాన్ని బట్టి ఇన్వెస్టర్లు తమ వైఖరిని ఖరారు చేయనున్నారు.
ఈ ఏడాది తులం బంగారం ధర ఆరు శాతం పతనమైంది. కొవిడ్ రెండో వేవ్ ఉద్ధ్రుతంగా సాగుతున్న వేళలో బంగారంపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. డాలర్ ఇండెక్స్ 0.16 శాతం పెరిగింది. దీంతో ఇతర కరెన్సీలతో పోలిస్తే బంగారం మరింత వ్యయ భరితం కాగలదని అంచనా. డాలర్ విలువ పడిపోయి, రూపాయి విలువ పెరుగనున్నది.
పీపీఈ కిట్లో పెళ్లి.. వైరల్ వీడియో
భారత్ మమ్మల్ని వ్యాక్సిన్లు అడగలేదు: అమెరికా
తరుణ్ తేజ్పాల్పై అత్యాచార ఆరోపణల కేసు.. విచారణ మే 12కు వాయిదా
అఫీషియల్: ఆచార్య చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన నిర్మాణ సంస్థ
భారత్ మమ్మల్ని వ్యాక్సిన్లు అడగలేదు: అమెరికా
vaccine registration : 18 ఏళ్లు పైబడిన వారు కరోనా టీకా కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి
సరికొత్త హయబూసా.. ధర 16.4 లక్షలు
కేజీ-డీ6 శాటిలైట్ క్లస్టర్లో ఉత్పత్తి
తనయ పెండ్లి ఖర్చు.. సిలిండర్ల కొనుగోలుకు.. ఎంతంటే!
ఎస్బీఐలో 5 వేల క్లర్క్ పోస్టులు.. దరఖాస్తులు ప్రారంభం
ఢిల్లీ ఎయిమ్స్కు చోటా రాజన్ తరలింపు
తగ్గేదే లే.. రిలీజ్ డేట్ ప్రకటించిన మెగాస్టార్
కరోనాతో సీనియర్ నటి భర్త మృతి