కరోనా సెకండ్ వేవ్ వలన చాలా సినిమాలు వాయిదా పడుతుంటే మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ మాత్రం తన తాజా చిత్ర డేట్ను ప్రకటించి ఆశ్చర్యపరిచారు. కొద్ది రోజుల క్రితం దృశ్యం 2 అనే సినిమాతో ఎంతగానో అలరించిన మోహన్ లాల్ ప్రస్తుతం ‘మరక్కార్: అరేబియా సముద్ర సింహం’ అనే చిత్రం చేస్తున్నాడు. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దక్షిణాది భాషలు సహా హిందీలో మే 13న విడుదల చేస్తున్నట్లు ముందుగా నిర్మాతలు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొద్ది రోజులు వాయిదా వేశారు.
‘మరక్కార్: అరేబియా సముద్ర సింహం’ చిత్రాన్ని ఆగస్ట్ 12న విడుదల చేస్తున్నట్లు ప్రకటనను మోహన్లాల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని మోహన్ లాల్ భావిస్తున్నారు. మోహన్లాల్, ప్రియదర్శన్ కాంబినేషన్లో 40కు పైగా చిత్రాలు రాగా, ఈ సినిమా మాత్రం ఇద్దరికి చాలా స్పెషళ్ అంటున్నారు. చిత్రంలో మోహన్లాల్ యంగర్ వెర్షన్లో ఆయన తనయుడు ప్రణవ్ మోహన్లాల్ నటించారు. అర్జున్, సునీల్ శెట్టి, మంజూ వారియర్, ప్రభుదేవా, ప్రభు, కీర్తీ సురేశ్, కల్యాణీ ప్రియదర్శన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
ఇవికూడా చదవండి..