శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇదివరకే డ్రోన్ల ఆధారంగా బాంబులు పేల్చిన సంఘటనలు జరిగాయి. దాంతో డ్రోన్లను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానాన్ని డీఆర్డీఏ సిద్ధం చేసి జమ్ముకశ్మీర్లో ఆర్మీకి అందించింది. అయినప్పటికీ ఎయిర్ఫోర్స్ స్టేషన్, కంటోన్మెంట్కు సమీపంలోని సత్వారీ ప్రాంతంలో మరోసారి డ్రోన్లు కనిపించి సంచలనం సృష్టించాయి. ఆర్మీ జవాన్లు ఈ డ్రోన్ను చూసి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
ఆగస్టు 15 ను దృష్టిలో ఉంచుకుని జమ్ముకశ్మీర్లోని భద్రతా సంస్థలు అప్రమత్తంగా ఉన్నాయి. అంతకుముందు డీజీపీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. డ్రోన్ల వల్ల కలిగే ప్రమాదం దృష్ట్యా భద్రతా సంస్థలను అప్రమత్తంగా ఉండాలని అధికారులకు డీజీపీ సూచించారు. సమావేశం ముగిసిన కొద్దిసేపటికే డ్రోన్ తిరుగుతూ కనిపించడం కలకలం రేపింది. గత నెల 26 న జమ్ము ఎయిర్ఫోర్స్ స్టేషన్పై డ్రోన్లతో మందుగుండు జారవిడిచి ఉగ్రవాదులు పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. రెండు ఐఈడీలను డ్రోన్ల సాయంతో జారవిడిచినట్లు అధికారులు గుర్తించారు. మరుసటిరోజు కూడా కాలుచక్ మిలిటరీ స్టేషన్ ప్రాంతంలో మరో డ్రోన్ ఎగురుతూ కనిపించింది. మూడోసారి జూన్ 28 న సుంజ్వాన్ మిలిటరీ స్టేషన్ వద్ద కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
చైనాను ముంచెత్తిన వరదలు : సబ్వేలో చిక్కుకుని 12 మంది మృతి
రాజ్కుంద్రా ‘క్యూ’ చెప్పింది ఇక్కడే..?
చరిత్రలో ఈ రోజు.. 138 ఏండ్ల క్రితం థియేటర్ ప్రారంభం
ఆకాశంలో బర్త్డే, పెండ్లి రోజు ఫంక్షన్లు..! ఎక్కడంటే?
ఇంట్లో ఫోన్ మర్చిపోయారా..? డోంట్వర్రీ కారు ఉందిగా..!
సిద్ధమైన 3 డీ ప్రింటెడ్ స్టీల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..?
ఈ వ్యాయామం రోజూ చేస్తే రోగాల నుంచి దూరంగా ఉండొచ్చు.. ఏంటది?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..