ఆమెస్టర్డామ్ : త్రీ డీ లో ప్రింటింగ్ చేసిన పలు వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. ఈ జాబితాలోకి నెదర్లాండ్స్లోని స్టీల్ బ్రిడ్జ్ కూడా చేరింది. ప్రపంచంలోని మొట్టమొదటి 3 డీ ప్రింటెడ్ స్టీల్ వంతెనను ఆమెస్టర్డామ్లో నిర్మించారు. ఈ వంతెనను 4 రోబోలు కలిసి నిర్మించడం మరో విశేషం.
అమెస్టర్డామ్లోని అతి పురాతన కాలువపై నిర్మించిన ఈ వంతెన కోసం దాదాపు 4,500 కిలోల ఉక్కును ఉపయోగించారు. నెదర్లాండ్స్కు చెందిన ఎంఎక్స్ 3 డీ సంస్థ దీనిని జూలై 15 న ప్రారంభించి జూలై 18 న ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
దాదాపు 12 మీటర్ల పొడవైన ఈ వంతెనను 4 రోబోలు కలిసి తయారు చేశాయి. ఈ వంతెన సిద్ధం కావడానికి దాదాపు 6 నెలల సమయం పట్టింది. పెద్ద పడవ సహాయంతో వంతెనను కాలువ వద్దకు తీసుకువచ్చి క్రేన్ సహాయంతో అమర్చారు. వంతెనను తనిఖీ చేసే సెన్సార్ సంస్థ ఈ స్టీల్ బ్రిడ్జికి ఎంఎక్స్ 3 డీ అని పేరు పెట్టింది. 3 డీ-ప్రింటింగ్ అనేది తయారీ సాంకేతికత. దీని సహాయంతో 3 డైమెన్షనల్ విషయాలు సృష్టిస్తారు. వాటిని 3డీ- ప్రింటర్తో తయారు చేస్తారు.
సాధారణంగా కంప్యూటర్ ప్రింటర్లో ప్రింటింగ్కు ఇంక్తోపాటు పేపర్ అవసరం అవుతాయి. అదే 3 డీ-ప్రింటర్లో మనం సృష్టించే వస్తువుల సైజ్, కలర్, డిజైన్ను కూడా నిర్ణయించవచ్చు. ప్రతిదీ సెట్ చేయబడిన తర్వాత డాటాను యంత్రంలోకి అందిస్తారు. రోబోలు వస్తువులను తయారుచేసే పనిని చేపడతాయి.
నటి కరీనా కపూర్ పుస్తకం ‘ప్రెగ్నెన్సీ బైబిల్’పై ఫిర్యాదు
చరిత్రలో ఈరోజు.. విభజించు పాలించు ప్రారంభం
England Vs Pakistan | సిక్స్ కొడితే.. దద్దరిల్లిపోయింది..!
ఈ వ్యాయామం రోజూ చేస్తే రోగాల నుంచి దూరంగా ఉండొచ్చు.. ఏంటది?
ఒక్క వన్డే.. 10 రికార్డులు.. అవేంటంటే..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..