జబల్పూర్ : బాలీవుడ్ నటి కరీనా కపూర్ రాసిన పుస్తకం మరోసారి వివాదాస్పదంగా మారింది. ఈసారి మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో పుస్తకంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. కరీనా రాసిన ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ పుస్తక శీర్షికపై క్రైస్తవ సమాజం అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా కరీనాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారించాలని డిమాండ్ చేసింది.
బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఇటీవల తాను గర్భం ధరించిన సమయంలో ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ పుస్తకాన్ని రాసి మార్కెట్లోకి విడుదల చేసింది. అప్పటి నుంచి ఈ పుస్తకం టైటిల్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు ప్రారంభమయ్యాయి.కరీనాపై మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో పోలీసులకు ఫిర్యాదు అందింది. కరీనా పుస్తకం ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ శీర్షికపై క్రైస్తవ సమాజం అభ్యంతరం వ్యక్తం చేసింది. జబల్పూర్ క్రైస్తవ సమాజం ఈ విషయంలో ఒమాటి పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. పుస్తకం శీర్షిక తమ మతపరమైన భావాలను దెబ్బతీసిందని ఆ సంస్థ ఆరోపించింది. శీర్షిక నుంచి బైబిల్ అనే పదాన్ని తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
పుస్తకం టైటిల్లో బైబిల్ అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా కరీనా తమ మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ జబల్పూర్లోని సర్వా క్రిస్టియన్ మహాసభ ఆరోపించింది. కరీనా పుస్తకం శీర్షిక నుంచి బైబిల్ అనే పదాన్ని తొలగించాలని మహాసభ కోరింది. కరీనాపై అందిన ఫిర్యాదుపై ఒమాటి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని ఒమాటి పోలీసు అధికారి శివ ప్రతాప్ సింగ్ బాగెల్ తెలిపారు. మరోవైపు, పోలీసులు కేసు నమోదు చేయనిపక్షంలో కోర్టును ఆశ్రయిస్తామని మహాసభ హెచ్చరించింది.
చరిత్రలో ఈరోజు.. విభజించు పాలించు ప్రారంభం
England Vs Pakistan | సిక్స్ కొడితే.. దద్దరిల్లిపోయింది..!
ఈ వ్యాయామం రోజూ చేస్తే రోగాల నుంచి దూరంగా ఉండొచ్చు.. ఏంటది?
ఈసారి సెంట్రల్ వర్సిటీల్లో నేరుగా ప్రవేశాలు
ఒక్క వన్డే.. 10 రికార్డులు.. అవేంటంటే..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..