న్యూఢిల్లీ : శ్రీలంకతో టీమిండియా ఆడిన తొలి వన్డేలో 10 రికార్డులు నమోదయ్యాయి. తొలి వన్డేలో శ్రీలంక జట్టును భారత్ చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో యువ క్రికెటర్లు తమ సత్తా ఏంటో చూపించి కొత్త రికార్డులు నమోదయ్యాలా చేశారు. తొలి వన్డేలో టీంఇండియా మరో 80 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ 263 పరుగులు చేసి 7 వికెట్లతో విజయం సాధించి 3 వన్డేల సిరీస్లో 1-0తో ముందున్నది. ఆ 10 రికార్డులు ఏంటంటే..
ఈ తొలి వన్డే ఇండియా-శ్రీలంక మధ్య జరిగిన 160 వ మ్యాచ్ కాగా, శ్రీలంకపై 92 విజయాలు నమోదు చేసి కొత్త రికార్డును నమోదు చేసుకున్నది. పాకిస్తాన్ కూడా శ్రీలంకపై 155 మ్యాచులు ఆడి 92 విజయాలు నమోదు చేసుకున్నది.
అంతర్జాతీయ క్రికెట్లో శిఖర్ ధావన్ 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నారు. శ్రీలంకతో తొలి వన్డేలో శిఖర్ ధావన్ 95 బంతులు ఆడి 86 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 10 వేల పరుగులు పూర్తిచేసుకున్న 14 వ భారతీయ క్రికెటర్గా శిఖర్ ధావన్ నిలిచారు. 34,357 పరుగులతో సచిన్ తొలి స్థానంలో ఉన్నారు.
తొలి వన్డేలో 23 వ పరుగులు చేయగానే శిఖర్ ధావన్ వన్డేల్లో 6 వేల పరుగులు పూర్తి చేసుకుని గంగూలీని వెనక్కి నెట్టాడు. తక్కువ వన్డేల్లో 6 వేల పరుగులు పూర్తిచేసిన నాలుగో ఆటగాడిగా శిఖర్ ధావన్ నిలిచారు. సౌరవ్ 147 ఇన్నింగ్స్లో 6 వేలు చేయగా, శిఖర్ 141 ఇన్నింగ్స్లోనే ఇది సాధించాడు. 123 ఇన్సింగ్స్ల్లో వేగంగా 6 వేల పరుగులు పూర్తి చేసి హషీం ఆమ్లా తొలి స్థానంలో ఉన్నారు.
కెప్టెన్గా టీమిండియాను విజయతీరాలకు చేర్చిన శిఖర్ ధావన్ వన్డేల్లో 50 వ సారి 50 కి పైగా పరుగులు సాధించాడు. శిఖర్ ఇప్పటివరకు 33 ఫిఫ్టీలు, 17 సెంచురీలు చేశాడు. ఇలాంటి ఫీట్ అందుకున్న 10 వ భారతీయ క్రికెటర్గా శిఖర్ నిలిచారు. సచిన్ అందరికన్నా ముందున్నాడు.
శ్రీలంకపై వేగంగా వేయి పరుగులు మైలురాయిని చేరిన రికార్డును కూడా శిఖర్ ధావన్ తన పేరిట లిఖించుకున్నాడు. శ్రీలంకపై శిఖర్ 17 ఇన్నింగ్స్ ఆడి వేగంగా వేయి పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచి దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీం ఆమ్లా రికార్డును బద్దలు కొట్టారు.
కెప్టెన్గా ఆడిన తొలి వన్డేలో 50 ప్లస్ పరుగులు చేసిన శిఖర్ ధావన్ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. కెప్టెన్గా ఆడిన తొలి వన్డేలోనే 50 ప్లస్ పరుగులు చేసిన ఐదో భారతీయ క్రికెటర్గా శిఖర్ నిలిచారు. ఈయన కన్నా ముందు అజిత్ వాడేకర్, రవిశాస్త్రి, సచిన్, అజయ్ జడేజా ఉన్నారు. కెప్టెన్గా ధోని తన రెండో వన్డేలో 50 ప్లస్ పరుగులు సాధించారు.
ఇదే వన్డేలో ఇషాంత్ కిషన్ కొత్త రికార్డును తన పేరిట రాసుకున్నాడు. ఒకే ఏడాదిలో వన్డేతోపాటు టీ20 లో హాఫ్ సెంచరీ చేసిన రెండో భారతీయ బ్యాట్స్మెన్గా నిలిచారు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో 42 బంతులను ఎదుర్కొన్న ఇషాంత్ కిషన్ 59 పరుగులు చేశారు. ఇంగ్లండ్తో జరిగిన టీ20 లో ఇషాంత్ కిషన్ హాఫ్ సెంచరీ చేశాడు.
శ్రీలంకను 9 వరుస మ్యాచుల్లో ఓడించి టీమిండియా కొత్త రికార్డు నమోదు చేసింది. ఈ రికార్డును ఇంతవరకు ఏ టీం సాధించలేదు. 4 వరుస మ్యాచుల్లో గెలుపొంది దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉన్నది.
పవర్ ప్లేలో పెద్ద స్కోర్ నమోదు చేసిన జట్టుగా ఇండియాకు కొత్త రికార్డు వచ్చింది. తొలి 10 ఓవర్లలో ఇండియా వికెట్ నష్టపోయి 91 పరుగులు చేసింది. 2013 నుంచి ఇదే హయ్యెస్ట్ స్కోర్. 2019 లో వెస్టిండీస్పై పవర్ ప్లేలో ఇండియా 83 పరుగులు చేసింది.
ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా హాఫ్ సెంచరీ చేయకుండా శ్రీలంక పెద్ద స్కోర్ నమోదు చేయడం విశేషం. 9 వికెట్లు కోల్పోయిన శ్రీలంక 262 పరుగులు చేసింది. ఇదే శ్రీలంక హయ్యెస్ట్ వన్డే స్కోర్ కూడా కావడం విశేషం. గతంలో హాఫ్ సెంచరీలు లేకుండా శ్రీలంక జట్టు (పాకిస్తాన్ జట్టుపై 2006లో ) 253 పరుగులు చేసింది.
పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం, 30 మంది మృతి
చరిత్రలో ఈరోజు.. 14 బ్యాంకులను జాతీయం చేసిన ఇందిరాగాంధీ
ఈ టీచర్లు జిహదీలను తయారుచేస్తారంట..!
కృత్రిమ మేధస్సుకు మెదడు న్యూరాన్ల మోడల్ సృష్టి
సిద్ధివినాయకుడికి 2 కోట్లతో గుడి కట్టిన క్రిస్టియన్..! ఎందుకంటే..?
త్వరలో స్పేస్ మసాలా..! కావాలంటే వీరిని సంప్రదించాలి..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..